/rtv/media/media_files/2025/06/11/ienJcc3agb83GIBFPQth.jpg)
Telangana-Ministers
Cabinet expansion: తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చాలా కాలానికి మంత్రివర్గాన్ని విస్తరించారు. క్యాబినెట్లో ఆరు ఖాళీలు ఉండగా ముగ్గురికి మాత్రమే మంత్రులుగా అవకాశం కలిపించారు. కొత్త మంత్రులకు ఏయే పోర్టు పోలియోలు ఇవ్వబోతున్నారు అనే అంశంలో ఉత్కంఠ నెలకొంది, అయితే ఆ ముగ్గురి సామాజిక నేపథ్యంతో వారికి ఆయా శాఖల పట్ల ఉన్న అవగాహనను బట్టి వారికి శాఖలు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయించబోతున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
Also Read : జూన్ 14 వరకు భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం
అయితే ముగ్గురు మంత్రివర్గంలో కొత్తవారే కావడంతో వారికి కేటాయించే శాఖల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని రకాల సలహాలు సూచనలు తీసుకున్నాడని తెలుస్తోంది. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్, అడ్లూరి లక్ష్మణ్కుమార్కు ఎస్సీ, ఎస్టీ, మైనార్జీ సంక్షేమం, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలు కేటాయించినట్లు తెలుస్తున్నది.
కాగా ఈ రోజు శాఖల కేటాయింపు అనంతరం రేపు ఆయా శాఖల మంత్రులు తమ పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. దీనికోసం తెలంగాణ సెక్రటేరియట్ లో వారికి తగిన చాంబర్లను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారులు వారి చాంబర్లను సిద్ధం చేస్తున్నారు.