Dasara 2025: దసరాకు సొంతూరు వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త.. TGSRTC కీలక ప్రకటన!

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంతూరుకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో 7754 స్పెష‌ల్ బ‌స్సుల‌ను నడపడానికి నిర్ణయించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

New Update
TGSRTC

TGSRTC

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంతూరుకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో 7754 స్పెష‌ల్ బ‌స్సుల‌ను నడపడానికి నిర్ణయించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ బస్సులో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు  రిజర్వేషన్ సౌకర్యాన్ని టీజీఎస్‌ఆర్టీసీ కల్పించింది. ఈ ప్రత్యేక బస్సులు అన్ని కూడా ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు నడపనున్నట్లు తెలిపింది. అయితే ఈ నెల 30న‌ సద్దుల బ‌తుకమ్మ, అక్టోబ‌ర్ 2న దసరా ఉన్నందున రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీన సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. అలాగే తిరుగు ప్రయాణాల్లో కూడా రద్దీ ఎక్కువగా ఉన్నందున అక్టోబర్ 5, 6వ తేదిల్లోనూ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనుంది. 

ఇది కూడా చూడండి: HYD Crime: మహిళా డాక్టర్ ప్రాణం తీసిన సైబర్ నేరగాళ్లు.. హైదరాబాద్‌లో దారుణం!

ఇది కూడా చూడండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికులతో కీలక భేటీ..

హైదరాబాద్‌లో ప్రధాన బస్టాండ్లు అయిన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను టీజీఎస్‌ఆర్టీసీ నడిపించనుంది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు న‌డుపుతోంది. దసరా స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధ‌ర‌లను సంస్థ సవరించనుంది. ఈ నెల 20తో పాటు 27 నుంచి 30 తేది వరకు వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6 వ తేదిల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యూలర్ సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండవని తెలిపింది. 

గతేడాది కంటే ఈసారి ఎక్కువ బస్సులు..

గతేడాది దసారా కంటే ఈసారి అదనంగా 617 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీజీఎస్‌ఆర్టీసీ తెలిపింది. రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం ప్రత్యేక క్యాంప్‌లను ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఉప్పల్, ఎల్‌బీనగర్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, సంతోష్ నగర్‌లో కూర్చీలు, తాగునీరు వంటి మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రద్దీగా ఉన్న ప్రతీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నామన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారు. పోలీస్, ర‌వాణా, మున్సిపల్ శాఖల అధికారుల‌తో సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాల‌కు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. పండుగలకు రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బందులు పడొద్దని ఆయన సూచించారు. బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tgsrtcbus.in లో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

Advertisment
తాజా కథనాలు