/rtv/media/media_files/2025/06/04/gSohQuyGQ9ousUZ1XBff.jpg)
Jogulamba Ethanol Industry
Jogulamba Ethanol Issue: జోగులాంబ గద్వాల(Gadwal) జిల్లా రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ లో ఉద్రిక్తత చెలరేగింది. స్థానికంగా ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం మొత్తం 10 గ్రామాలకు చెందిన ప్రజలు ఊహించని రీతిలో పెద్ద ధన్వాడ(Dhanwada)లో ఫ్యాక్టరీ నిర్మించ తలపెట్టిన ప్రాంతానికి చేరుకుని ఆందోళనకు దిగారు. కొంత కాలంగా 12 గ్రామాల ప్రజలు పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం గాయత్రి కంపెనీ వారు పరిశ్రమ ఏర్పాటుకు కూలీలను తీసుకొచ్చారు. ఇది ప్రజలకు మరింత ఆగ్రహనికి దారితీసింది.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్కు పండగే.. రాజాసాబ్ రిలీజ్ డేట్ ఇదే!
ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఆయా గ్రామాల రైతులు బుధవారం పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రాంతానికి చేరుకొన్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడానికి భారీగా పోలీసులు మోహరించారు. అయినప్పటికీ రైతులు, మహిళలు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రాంతానికి చేరుకున్నారు.పనులు ప్రారంభించేందుకు వచ్చిన ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై తిరగబడ్డారు.అక్కడ వారు వేసుకున్న టెంట్లను తొలగించి సామగ్రిని ధ్వంసం చేశారు. అలాగే అక్కడున్న కూలీలను రాళ్లతో తరిమికొట్టారు. వారి కార్లతో పాటు ఇతర సామగ్రిని పూర్తిగా ధ్వంసం చేసి వాటికి నిప్పంటించారు.పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: యువతి ప్రైవేట్ పార్ట్స్పై స్క్రూ డ్రైవర్తో పొడిచి దారుణ హత్య
కాగా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును చాలాకాలంగా ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటలు చేయగా.. కొన్ని రోజుల పాటు వివాదం సద్దుమణిగింది. తాజాగా, మంగళవారం ఫ్యాక్టరీ యజమాన్యం నిర్మాణ పనులు ప్రారంభించడానికి ముందుకు వచ్చింది. దాని కోసం యాజమాన్యం కంటైనర్లతో పాటు జేసీబీలు, కార్మికులను పెద్ద ఎత్తున పెద్ద ధన్వాడకు తీసుకెళ్లింది. ఇవాళ10 గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ మరోసారి పోరుబాట పట్టారు.
Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్లో అధికారం మాదే: అమిత్ షా
కాగా ప్రతిపాదిత ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ 12 గ్రామాల ప్రజలు ఆందోళనకు పిలుపుననిచ్చారు. ఇందుకు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఉదయం నుంచి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవ్వరినీ కూడా ఇథనాల్ కంపెనీ పరిసరాల్లోకి రానీయకుండా గట్టి భద్రతను కల్పించారు. అంతేకాకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని హౌజ్ అరెస్ట్ చేసి ఇంట్లో నుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉగ్రరూపం దాల్చింది.
Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు