తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. రన్నింగ్ లో ఆర్టీసీ బస్సు టైర్ పగలడంతో..!

టైర్ పగిలిపోవడంతో పొలాల్లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటన సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల వద్ద చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులకు తీవ్ర గాయల పాలయ్యారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
Telangana RTC Bus Accident

Telangana RTC Bus Accident

తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రన్నింగ్ లో ఆర్టీసీ బస్సు టైర్ పగిలిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురి ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాదం గమనించి స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను కష్టం మీద బయటకు తీసుకువచ్చారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు