బర్త్ డే పార్టీలో వివాదం నేపథ్యంలో సింగర్ మంగ్లీ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో FIR కాపీలో కీలక విషయాలు ప్రస్తావించారు. రాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో రిసార్ట్ పై ఫిర్యాదు వచ్చిందన్నారు. పెద్దపెద్ద సౌండ్స్ చేస్తూ హంగామా చేస్తున్నారంటూ కంప్లైంట్ అందిందని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున డీజే పెట్టారంటూ కంట్రోల్ రూమ్ కు స్థానికులు ఫోన్ చేశారన్నారు. దీంతో త్రిపుర రిసార్ట్ కు స్థానిక మహిళా ఎస్ఐ వెళ్లినట్లు చెప్పారు. పది మంది మహిళలు,12 మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. కొందరు మద్యం మత్తులో ఉండి డాన్సులు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.
ఇది కూడా చదవండి: Mangli: మంగ్లీ బర్త్ డే పార్టీలో డ్రగ్స్.. ఎవర్నీ వదలమని హెచ్చరించిన పోలీసులు
మంగ్లీ బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లుగా అక్కడ ఉన్న మేనేజర్ చెప్పారన్నారు. ఇందుకు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని మేనేజర్ తెలిపారన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎక్సైజ్ శాఖ నుంచి లిక్కర్ పర్మిషన్ తీసుకోలేదన్నారు. ఈ విషయమై మంగ్లీని విచారించామన్నారు. బర్త్ డే పార్టీకి, లిక్కర్, డీజేకు అనుమతి లేదని చెప్పారన్నారు. డీజేను ఈవెంట్ మేనేజర్ మేఘరాజు చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు.
ఇది కూడా చదవండి: Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం.. అసలేం జరిగిందంటే..!
అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్ట్ పై దాడిచేసిన చేవెళ్ల పోలీసులు. చట్టాలు పాటించకుండా ఎలాపడితేఅలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు ఝులిపించి గాడినపెట్టాల్సి వస్తుంది. ఎంతటిప్రముఖులైనా డ్రగ్స్ లాంటి వాటిని వాడే వారిపట్ల కఠినచర్యలు తీసుకోవడానికి వెనుకాడం. #TelanganaPolice pic.twitter.com/s4IbSzhIkM
— Telangana Police (@TelanganaCOPs) June 11, 2025
మంగ్లీ, ఆమె సోదరుడిపై కేసు..
పార్టీలో పాల్గొన్న పురుషులు, మహిళలలందరికీ డ్రగ్ టెస్ట్ నిర్వహించామన్నారు. అందులో మంగ్లీ అనుచరుడు దామోదర్ రెడ్డి గంజాయి తాగినట్లు గుర్తించామన్నారు. అతన్ని అరెస్టు చేసి విచారించి పంపించామన్నారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించిన మంగ్లీ సోదరుడు శివరామకృష్ణ పై కేసు నమోదు చేశామన్నారు. ఎక్సైజ్ అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసినందుకు మంగ్లీ పైన కేసు నమోదు చేశామన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీకి అనుమతి ఇచ్చిన త్రిపుర రిసార్ట్ మేనేజ్మెంట్ దామోదర్ పై కూడా కేసు పెట్టామన్నారు. ఈవెంట్ ఆర్గనైజర్ మేఘరాజ్ పై కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు.