BIG BREAKING: మంత్రులకు తప్పిన ప్రమాదం.. కూలిన టెంట్లు, జనం పరుగులు!

నిజామాబాద్ లో పర్యటిస్తున్న మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లికి పెను ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ హెలీప్యాడ్ కు బదులుగా సభా ప్రాంగణంలో ల్యాండ్ అయ్యింది. దీంతో గాలికి టెంట్లు కూలిపోయాయి. పలువురు అధికారులకు గాయాలయ్యాయి.

New Update

నిజామాబాద్ జిల్లాలో మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. స్థానికంగా ఏర్పాటు చేసిన రైతు మహోత్సవ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్ గౌడ్ హాజరయ్యారు. అయితే.. హెలీప్యాడ్‌ బదులు మరో చోట హెలీకాప్టర్‌ ల్యాండింగ్‌ అయినట్లు తెలుస్తోంది. కలెక్టరేట్‌ బదులుగా రైతు మహోత్సవ ప్రాంగణంలో ల్యాండింగ్ అయ్యింది. హెలీకాప్టర్‌ ల్యాండింగ్‌తో ఒక్కసారిగా భారీగా గాలులు వీచాయి. రైతు మహోత్సవ వేదిక కుప్ప కూలింది. దీంతో పలువురు పోలీసులు, అధికారులకు గాయాలయ్యాయి. భయంతో సభకు వచ్చిన ప్రజలు పరుగులు తీశారు. 
ఇది కూడా చదవండి: KTR : ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో కేసు..కేటీఆర్ కు హైకోర్టులో ఊరట

కూలిపోయిన స్టాల్స్..

ఈ సభలో పంట ఉత్పత్తులను ప్రదర్శించేందుకు దాదాపు 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు. కానీ ఈ ఘటనతో అవన్నీ చిందరవందరగా పడిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన అధికారులు సభను తిరిగి ప్రారంభించేందుకు హుటాహుటిన ఏర్పాట్లు చేశారు. దీంతో కొద్దిగా ఆలస్యంతో మీటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే.. పైలెట్ హెలీప్యాడ్ లో కాకుండా సభా ప్రాంగణంలో హెలీకాప్టర్ ఎందుకు ల్యాండింగ్ చేశాడనే అంశంపై చర్చ సాగుతోంది. ఈ మేరకు అధికారులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.   

ఇది కూడా చదవండి: TG News: హైదరాబాద్‌లో ఎకో టౌన్‌.. తెలంగాణలో జపాన్‌ భారీ పెట్టుబడులు!

(minister-thummala-nageswara-rao | minister-uttam-kumar-reddy | telugu-news | telugu-latest-news)

Advertisment
Advertisment
తాజా కథనాలు