Kavitha Vs CM Revanth: సీఎం రేవంత్ కు కవిత సంచలన లేఖ!

GHMC ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా అధికారుల తీరు ఉందని ఫైర్ అయ్యారు. ఆ టెండర్లను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

New Update
MLC Kavitha Vs CM Revanth Reddy

MLC Kavitha Vs CM Revanth Reddy

జీహెచ్ఎంసీలో మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్ స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు కవిత. తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారని ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్?: మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య సంచలన ప్రకటన!

తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం..

ఆ సంస్థకు హైదరాబాద్ లో రెండు షోరూములు మాత్రమే ఉన్నాయన్నారు. ఆ షోరూంల నిర్వాహకులు తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లతో ఎంఓయూ చేసుకునేందుకు ససేమిరా అంటున్నారన్నారు. తెలంగాణ కాంట్రాక్టర్లు కర్నాటక షోరూంల డీలర్ల నుంచి ఎంవోయూలు తెచ్చుకున్నా వాటి ఫిజికల్ కాపీలు తక్కువ వ్యవధిలో తెచ్చి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు జీహెచ్ ఎంసీలోని 150 వార్డులకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారన్నారు. ఇప్పుడు తొమ్మిది జోన్ ల వారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతోందన్నారు. 
ఇది కూడా చదవండి: ఎస్ఐ గల్లా పట్టి.. పాలకుర్తిలో హైటెన్షన్.. బీఆర్ఎస్ Vs కాంగ్రెస్ ఫైటింగ్!-VIDEO

అధికారులు పేర్కొన్న స్పెసిఫికేషన్స్ తో కూడిన వాహనాల్లో ఒక క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదన్నారు. గతంలో ఇందుకు వినియోగించిన వాహనాల్లో రెండు నుంచి మూడు క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించే వారన్నారు. అధికారులు ఒక సంస్థకు, రెండు కాంట్రాక్టు ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో ఒక్కో ఏడాదికి రూ.5.85 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఈ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుందన్నారు. మున్సిపల్ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి తన శాఖలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు