జనగాం జిల్లా పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వివాదానికి కారణమైంది. రోడ్డు విస్తరణ పనుల కారణంగా గతంలో ఇక్కడు ఉన్న విగ్రహాన్ని తీసి పక్కన పెట్టారు. ఇప్పడు పనులు పూర్తవడంతో మళ్లీ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. పాత విగ్రహాన్నే మళ్లీ పెట్టాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా రూపొందించిన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో నిర్మాణ పనులను బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. ఏకంగా రెండుసార్లు సెంట్రింగ్ నే కూల్చివేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఓ బీఆర్ఎస్ నేత ఎస్ఐ గల్లాపట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన పోలీసులు వారిని అక్కడి నుంచి తరిమికొట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేడు పాలకుర్తి బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతోందనన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే.. రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని పాలకుర్తి కాంగ్రెస్ నేతలు పట్టుదలతో ఉన్నారు.
ఎస్ఐ గల్లా పట్టి.. పాలకుర్తిలో హైటెన్షన్.. బీఆర్ఎస్ Vs కాంగ్రెస్ ఫైటింగ్!-VIDEO
పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు బీఆర్ఎస్ Vs కాంగ్రెస్ గా మారింది. BRS పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటుండగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం కొత్త విగ్రహాన్నే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నేత SI కాలర్ పట్టుకున్నాడు.
New Update
తాజా కథనాలు