/rtv/media/media_files/2025/11/04/telangana-human-rights-commission-takes-suo-motu-cognizance-of-chevella-lorry-bus-accident-2025-11-04-16-04-18.jpg)
Telangana Human Rights Commission takes suo motu cognizance of Chevella lorry-bus accident
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 19 ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు. కంకర లోడ్తో వస్తున్న టిప్పర్ లారీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుమోటాగా కేసు నమోదు చేసింది. డా. జస్టిస్ షమీమ్ అక్తర్, కమిషన్ ఛైర్పర్సన్ ఆధ్వర్యంలో ఈ కేసు నమోదు చేశారు.
Also Read: అయ్యో బిడ్డలు.. తల్లడిల్లిన తాండూరు.. ఎటు చూసినా ఏడుపే.. కన్నీటి యాత్ర!-VIDEO
రోడ్డు భద్రతా లోపాలు, రహదారి విస్తరణ, అధిక వేగం, అధికారుల నిర్లక్ష్యం లాంటి అంశాలపై కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రవాణా, హోం, గనులు, భూగర్భ శాస్త్రం శాఖలు, NHAI, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ అధికారుల నుంచి పూర్తి స్థాయి రిపోర్టులను డిసెంబర్ 15న ఉదయం 11 గంటల లోపు సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.
ఇదిలాఉండగా చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరువకముందే మరో బస్సు ప్రమాదం జరిగింది. గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఓ లారీని ఢీకొంది. వికారాబాద్ జిల్లా కరణ్కోట్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తలకు గాయాలయ్యాయి. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు.
వికారాబాద్ జిల్లా, తాండూరు మండలం కరణ్ కోట్ సమీపంలో కర్ణాటక ఆర్టీసీ బస్సుని ఢీకొట్టిన లారీ
— RTV (@RTVnewsnetwork) November 4, 2025
ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, బస్సు డ్రైవర్కు తీవ్ర తల గాయాలయ్యాయి
ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో ఇది మరో బస్సు ప్రమాదం #hyderabad#vikarabad#rtc#Lorry#accident#RTVpic.twitter.com/zZ0U2F8ZzY
Follow Us