/rtv/media/media_files/2025/03/21/Tyw7yv5UHhioRGBDGePe.jpg)
tg jobs Photograph: (tg jobs)
నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్ష ఫలితాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా విడుదల చేసింది. తాజాగా 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 42,244 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 40,423 మంది ఎగ్జామ్కు హాజరైనట్లు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.
నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్ష ఫలితాలు విడుదల
— Damodar Raja Narasimha (@DamodarCilarapu) May 5, 2025
ఉద్యోగాల భర్తీలో ఆరోగ్యశాఖ వేగం పెంచింది.
2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన, పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేసింది.
ఈ పోస్టులకు మొత్తం 42,244 మంది నర్సులు దరఖాస్తు చేసుకోగా, 40,423 మంది ఎగ్జామ్కు హాజరయ్యారు.… pic.twitter.com/VgJkMiq38a
త్వరలోనే ప్రొవిజనల్ లిస్ట్..
ఫలితాలను బోర్డు వెబ్సైట్లో (https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm) వెబ్ సైట్లో మార్కులను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అభ్యర్థులు తమ మార్కుల వివరాలను చెక్ చేసుకోవాలని మెడికల్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేస్తామని వెల్లడించింది.
(telangana-jobs | Govt Job Notifications | telugu-news | latest-telugu-news)