/rtv/media/media_files/2025/05/05/dSBM5KOirwiQ3uarWf9R.jpg)
Earthquake in Karimnagar
కరీంనగర్ లో స్వల్పంగా భూమి కంపించింది. వేములవాడ, సిరిసిల్ల, సుల్తానాబాద్ లోనూ భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో జనాలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. కడెం,జిన్నారం, లక్సెట్టిపేటలోనూ భూకంప ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. గంగాధర, రామడుగు, చొప్పదండి,కమ్మర్పల్లి, మోర్తాడ్ లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జగిత్యాల జిల్లాలో 10 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. భూకంపం ధాటికి భవనాలు ఊగినట్లు వివరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైనట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Warangal Fire Accident: వరంగల్లో భారీ అగ్ని ప్రమాదం..30 ఎకరాల్లో పంట దగ్ధం
BIG BREAKING
— PulseNewsBreaking (@pulsenewsbreak) May 5, 2025
కరీంనగర్లో భూకంపం.. రెండు సెకన్ల పాటు కంపించిన భూమి
కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, వేములవాడ ప్రాంతాల్లో భూప్రకంపనలు
ఈ దెబ్బకు.. భయంతో తమ ఇళ్లల్లో నుంచి బయటకు జనం పరుగులు#Karimnagar #Earthquake #Telangana pic.twitter.com/vpOxcabvek
కరీంనగర్ లో స్వల్ప భూకంపం pic.twitter.com/dog1xPlaqL
— Gayathri Bandari 🪷 🚩 (@GayathriBDevi) May 5, 2025
కరీంనగర్ లో ఒక పక్క వర్షం.. ఒక పక్క భూకంపం..
— RTV (@RTVnewsnetwork) May 5, 2025
భయంతో బయటకు పరుగులు తీసిన ప్రజలు#earthquake #Telangana #KARIMNAGAR #RTV pic.twitter.com/4FFWADrQqy
గతేడాది డిసెంబర్లోనూ..
ఆరు నెలల క్రితం గతేడాది డిసెంబర్ లోనూ తెలంగాణలో భూప్రకంపనలు భయపెట్టాయి. మేడారం కేంద్రంగా భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో డిసెంబర్ 4న ఉదయం 7:27 గంటలకు భూకంపం వచ్చింది. దీంతో జనాలు భయంతో పరుగులు తీశారు. మైనింగ్ బెల్ట్ తో పాటు గోదావరి చుట్టు పక్కల ప్రాంతాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. పలు ప్రాంతాల్లో గోడలు కూడా కూలిపోయాయి. భూకంప కేంద్రం భూమికి 40 కిలో మీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దాని చుట్టూ 225 కిలో మీటర్ల దూరం వరకు భూకంపం ప్రభావం కనిపించింది.
(telugu states earth quake | karimnagar-district | telugu-news | telugu breaking news | latest-telugu-news)