జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో అతి త్వరలోనే అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎవరిని బరిలోకి దించుతుందనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన అజారుద్దీన్ కు మళ్లీ ఛాన్స్ ఉండదని.. ఈ సారి కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ముఖ్యంగా పీజేఆర్ కూతురు విజయారెడ్డి లేదా నవీన్ యాదవ్ పేర్లను ఆ పార్టీ పరిశీలిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది.
అయితే.. తానే కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటానని అజారుద్దీన్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో తనకు టికెట్ వచ్చిందన్నారు. ఆఖరి నిమిషం వరకు గెలుపు కోసం పోరాడానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ కే పడేలా తాను పని చేశానని చెప్పుకొచ్చారు. తమ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కావాలనే తనకు టికెట్ రాదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
అగ్రనేతల ఆశీస్సులు నాకే..
తనకు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణు గోపాల్ ఆశీస్సులు ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో తాను జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానన్నారు. ఇక్కడ విజయం సాధించి రాష్ట్రం నుంచి మరో ఎమ్మెల్యే సీటును రాహుల్ గాంధీకి బహుమతిగా ఇస్తామన్నారు.
జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసేది నేనే.. గెలిచేది నేనే.. కాంగ్రెస్ నేత సంచలన ప్రకటన!
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తాను పోటీ చేయడం ఖాయమని అజారుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. తాను బరిలో ఉండడం లేదని కొందరు తమ పార్టీ నేతలే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక్కడ విజయం సాధించి రాహుల్ కు మరో సీటును బహుమతిగా ఇస్తానన్నారు.
Telangana Jubileehills by election
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో అతి త్వరలోనే అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎవరిని బరిలోకి దించుతుందనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన అజారుద్దీన్ కు మళ్లీ ఛాన్స్ ఉండదని.. ఈ సారి కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ముఖ్యంగా పీజేఆర్ కూతురు విజయారెడ్డి లేదా నవీన్ యాదవ్ పేర్లను ఆ పార్టీ పరిశీలిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది.
అయితే.. తానే కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటానని అజారుద్దీన్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో తనకు టికెట్ వచ్చిందన్నారు. ఆఖరి నిమిషం వరకు గెలుపు కోసం పోరాడానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ కే పడేలా తాను పని చేశానని చెప్పుకొచ్చారు. తమ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కావాలనే తనకు టికెట్ రాదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
అగ్రనేతల ఆశీస్సులు నాకే..
తనకు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణు గోపాల్ ఆశీస్సులు ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో తాను జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానన్నారు. ఇక్కడ విజయం సాధించి రాష్ట్రం నుంచి మరో ఎమ్మెల్యే సీటును రాహుల్ గాంధీకి బహుమతిగా ఇస్తామన్నారు.