/rtv/media/media_files/2025/01/13/qa5pGQkwOLDni36JJ4k2.jpg)
CM Revanth
అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు అందాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవం జనవరి 26న ప్రజా ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు. జనవరి 26న రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక గ్రామంలో నూటికి నూరు శాతం అమలు చేయడం ద్వారా రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రులు తెలిపారు.
ఈ నెల 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి మూడు ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో ఆ పథకాల అమలు …అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందేలా కార్యచరణ పై అందుబాటులో ఉన్న మంత్రులు… ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఈ రోజు… pic.twitter.com/YRPRlfY92D
— Revanth Reddy (@revanth_anumula) January 25, 2025
రేపటి నుంచి మార్చి వరకు..
కొత్తగా లక్షల్లో దరఖాస్తులు వచ్చినందున జనవరి 26 నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.