/rtv/media/media_files/2025/06/19/telangana-cm-revanth-reddy-2025-06-19-19-10-50.jpg)
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తోన్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించాలని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ -1980 (జీడబ్ల్యూడీటీ), ఏపీ పునర్విభజన చట్టం – 2014 కు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బనకచర్లపై అభ్యంతరాలతో పాటు నీటి వాటాలకు సంబంధించి అనేక అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించాలని జల్శక్తి మంత్రి @CRPaatil గారిని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు కోరారు. బనకచర్ల ప్రాజెక్టు విష… pic.twitter.com/UZ4PJqBZpL
— Telangana CMO (@TelanganaCMO) June 19, 2025
తెలంగాణ ప్రజల్లో ఆందోళన..
బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయన్నారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోందన్నారు. జీడబ్ల్యూడీటీ - 1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదన్నారు. నిబంధనలు పాటించకుండా వరద జలాల ఆధారంగా ప్రాజెక్ట్ చేపడుతున్నామని చెబుతుండడం తీవ్ర అభ్యంతరకరమన్నారు.
తక్షణమే జోక్యం చేసుకోండి..
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, జల్శక్తి మంత్రిత్వ శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా చూడాలన్నారు. తెలంగాణ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు. బనకచర్లకు సంబంధించిన డీపీఆర్ తమకు అందలేదని చెప్పారన్నారు. త్వరలోనే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని కేంద్ర మంత్రి పాటిల్ హామీ ఇచ్చినట్లు వివరించారు.