/rtv/media/media_files/2025/05/23/WnLUOc7K42j7Fjvbi6SN.jpg)
Show Cause Notice to MLC Kavitha:
బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం(BRS Party Merged into BJP) చేసేందుకు ప్రయత్నించారంటూ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీ చీఫ్ కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) లక్ష్యంగా కామెంట్స్ చేశారు కవిత. తాను రాసిన లేఖను(MLC Kavitha Letter) బయటపెట్టింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీని నడిపించడం చేతకాదు కానీ.. తన మీద కుట్ర చేస్తున్నారని పరోక్షంగా కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు.
తన మీద జైల్లో ఉన్నప్పుడే కుట్ర జరిగిందని చెప్పుకొచ్చారు. లీకు వీరులను బయటపెట్టమంటే.. గ్రీకు వీరులు తన మీద దండెత్తారని ధ్వజమెత్తారు. పదవులు పట్టుకుని వేలాడటం తనకు రాదన్నారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే ట్విట్టర్లో స్పందిస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. తాను అసలే మంచిదాన్ని కాదని.. జోలికొస్తే ఊరుకోనని హెచ్చరించారు. తనపై జరగుతున్న దుష్ప్రచారంపై బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించరని ప్రశ్నలు గుప్పించారు.
Also Read: మధ్యప్రదేశ్లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి
Also Read: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్కి శిక్ష ఏంటో తెలుసా?