/rtv/media/media_files/2025/01/30/foTULnEzTDMZYp8hX98A.jpg)
Telangana Congress Poll
తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ (X) ఖాతాలో పెట్టిన పోల్ తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? అని పోల్ పెట్టారు. ఈ పోల్ కు రెండు ఆన్సర్ ల్లు ఇచ్చారు అందులో గత కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉద్ధేశిస్తూ A. ఫామ్ హౌస్ పాలన.. నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్ధేశిస్తూ B. ప్రజల వద్దకు పాలన అంటూ రెండు ఆప్షన్లు ఇచ్చారు. అయితే.. ఇప్పటి వరకు 58,343 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు.
దొరల ఫాంహౌస్ పాలన ❌
— Congress for Telangana (@Congress4TS) January 30, 2025
కాంగ్రెస్ ప్రజా పాలన ✅
ఫాం హౌస్ పాలన ఎవరికీ కావాలని ఉండదు. ఎందుకంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులకి అధికారం ఇచ్చే వారు, కానీ అధికారం ఒక్క కొద్ది మంది కుటుంబ సభ్యుల కే పరిమితమైతే, అది ప్రజాస్వామ్యం కాదని ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు అదే… pic.twitter.com/AQnX66yGEK
ఇది బాట్ యూజర్ల పనే: కాంగ్రెస్
అయితే.. ఇందులో 66.1 శాతం మంది ఏ ఆప్షన్ పై క్లిక్ చేయగా.. 33.9 శాతం మంది కాంగ్రెస్ వైపు ఓటేశారు. ఇందుకు సంబంధించిన స్కీ్న్ షాట్స్ ను బీఆర్ఎస్ వైరల్ చేస్తోంది. ఇది ప్రభుత్వ పనితీరు అంటూ విమర్శలు చేస్తోంది. దొరల ఫాం హౌస్ బాట్ (BOT) యూజర్ల కారణంగానే తాము పెట్టిన పోల్ కు ఇలాంటి ఫలితం వచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Strategist Kanugolu and Revanth can’t fool people anymore…
— Dr.Krishank (@Krishank_BRS) January 30, 2025
Congis ran false propaganda against KCR but in his term Administration never stopped…
This poll by Congress Handle proves Revanth Administration is a Disastrous Failure…
Congratulations on completion of 420 Days pic.twitter.com/LQchnOCoZ2
తాగుబోతు సంఘం పార్టీ వాళ్లకు మాత్రమే అలాంటి పాలన నచ్చుతుందంటూ ఫైర్ అవుతున్నారు. నిజమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకునే తెలంగాణ ప్రజలు, ఈసారి సొంత బలంతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని చెబుతున్నారు.