/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
suicide
Sisters commit suicide : సికింద్రాబాద్ పరిధిలోని ఖార్ఖానాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో పురుగుల మందు తాగి అక్కాచెల్లెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్ని రోజులుగా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడం.. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి తలుపులు తెరిచి చూడగా.. అక్కాచెల్లెలు విగతజీవులుగా పడి ఉన్నారు.
Also Read: గర్ల్ఫ్రెండ్ను సూట్కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ
Also Read: సన్రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!
మృతులను వీణ, మీనాగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మానసిక స్థితి బాగలేకపోవడమే ఆత్మహత్యకు కారణమని స్థానికులు అంటున్నారు. వీనా, మీనాల ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
Also Read : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్ కీలక నిర్ణయం