/rtv/media/media_files/2025/02/28/8nDKdfh2y06qyVbUOZHd.jpg)
Telangana cabinet meeting
BC Reservations : స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదానికి పంపింది. కానీ, ఆయన ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో కెబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.
Also Read:ఫిడే మహిళల ప్రపంచకప్ విజేతగా దివ్య దేశ్ముఖ్
బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో భారీ ధర్నా చేయాలని నిర్ణయించారు. ఆగష్టు 5వ తేదీన మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులను కలుస్తారు. అదే సమయంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇండియా కూటమి మద్దతు కూడా కోరే అవకాశం ఉంది. మరోవైపు రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లు ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నది. మరోవైపు రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. వీటన్నింటి నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై మంత్రివర్గం చర్చించినట్లు తెలిసింది. కాగా, బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ఎటు తేల్చని సమక్షంలో ఢిల్లీలో దర్నా చేయడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read:ఐదో టెస్ట్కు పంత్ స్థానంలో అతడే - బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మెంటలెక్కుద్ది