SLBC Tunnel Collapse : ముగిసిన రెస్క్యూ ఆపరేషన్.. లభించని ఆరుగురు కార్మికుల ఆచూకీ. డేంజర్ జోన్ లో...

గడచిన 58 రోజులుగా శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో  సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది కార్మికులు గల్లంతవ్వగా ఇద్దరి మృత దేహాలను రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి. కానీ మరో ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు.

New Update
SLBC Tunnel Collapse

SLBC Tunnel Collapse

 SLBC Tunnel Collapse : గడచిన 58 రోజులుగా శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో  సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఎస్ఎల్‌బీసీ ప్రమాదంలో మొత్తం 8 మంది కార్మికులు గల్లంతవ్వగా ఇద్దరి మృత దేహాలను రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి. కానీ మరో ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు. షిర్ జోన్‌లో తవ్వకాలు అసాధ్యం అని రెస్క్యూ బృందాలు అంటున్నాయి. దీనిపై టెక్నికల్ కమిటీ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. నోగో జోన్‌లో తవ్వకాలు జరిపితే మృతదేహాలు దొరికే అవకాశం ఉందని రెస్క్యూ బృందాలు పేర్కొన్నాయి. సుదీర్ఘంగా సాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో రెండు మృతదేహాలను వెలికితీశారు.

ఇది కూడా చూడండి: 10th Class Students: ఆన్సర్ షీట్లో రూ.500.. ఛాయ్‌ తాగి నన్ను పాస్‌ చేయండి - 10th క్లాస్ స్టూడెంట్స్ అరాచకం

ఫిబ్రవరి 22న జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. దేశంలోనే నైపుణ్యం కలిగిన 12 సంస్థల బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మార్చి 9న గురుప్రీత్‌ సింగ్‌ మృతదేహాన్ని కనుగొన్నారు. ఇక మార్చి 22న ప్రాజెక్టు ఇంజినీర్‌ మనోజ్‌ కుమార్‌ మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు. అప్పటినుంచి రెస్క్యూ ఆపరేషన్ కొసనాగుతున్నా.. మరో ఆరుగురు కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. టన్నెల్‌లో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లు, టన్నెల్‌ బోరింగ్‌ యంత్రం (టీబీఎం) భాగాలను బయటకు తరలించారు. మరో 43 మీటర్లను డేంజర్‌ జోన్‌గా గుర్తించారు. ఈ జోన్‌కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగాయి.

Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..

కాగా అంతకుముందు టన్నెల్‌లో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ప్రమాదంలో ధ్వంసమైన టన్నెల్‌ బోరింగ్‌ యంత్రం (టీబీఎం) భాగాలను ఇప్పటికే బయటకు తరలించారు. మరో 43 మీటర్లను డేంజర్‌ జోన్‌గా గుర్తించారు. ఈ జోన్‌కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగాయి. ఈ డేంజర్‌ జోన్‌లో పనులు అంత సులభం కాదని రెస్య్కూ బృందాలు తేల్చి చెప్పాయి. అయితే మరో ఆరుగురి మృతదేహాలు లభించని కారణంగా అక్కడ పనులు చేయాలంటే పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై అధికారులు, సహాయక సిబ్బంది అన్వేషణ సాగిస్తున్నారు.

Wine in Tetra Pak : రూ. 105కే క్వార్టర్ మద్యం.... ఇక నుంచి వాటిల్లోనూ అమ్మకాలు..!!

ఈ జోన్‌ సమీపంలో భారీగా వస్తున్న నీటిని మోటార్లతో బయటకు తోడిపోస్తున్నామని ప్రత్యేకాధికారి (ఐఏఎస్‌) శివశంకర్‌ వివరించారు. టన్నెల్‌ ముఖ ద్వారం వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఆదివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సొరంగం కూలిన ప్రదేశంలో అక్కడక్కడ మిగిలిపోయిన టీబీఎం యంత్రం విడి భాగాలను దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది గ్యాస్‌ కట్టర్‌లతో కట్‌ చేసి లోకో రైలులో బయటకు పంపుతున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌ ముగిసినట్లేనని డేంజర్‌ జోన్‌లో పనులు చేయాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
 
  KTR : ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో కేసు..కేటీఆర్ కు హైకోర్టులో ఊరట

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు