/rtv/media/media_files/2025/03/29/0NvkjvqELI2NjeK4EaD5.jpg)
Property Tax Crossed 1000 Crores in Telangana
తెలంగాణలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను విషయంలో వన్టైమ్ సెటిల్మెంట్కు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. GHMC లాగే ఆస్తి పన్నుపై వడ్డీలో 90 శాతం రాయితీ ఇవ్వాలని పురపాలక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆస్తిపన్నుకు సంబంధించిన వసూళ్లు రూ.1000 కోట్లు దాటింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
Also Read: బెట్టింగ్ వలలో చిక్కడానికి మూలం అతడే.. నటి మాధవిలత సంచలన ఆరోపణ
తెలంగాణలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటిదాకా రూ.1010 కోట్ల వరకు ఆస్తిపన్ను వసూలైందని తెలిపింది. మార్చి 31 నాటికి ఆస్తిపన్ను బకాయిలపై 10 శాతం వడ్డీ చెల్లించిన వాళ్లకే ఓటీఎస్ వర్తిస్తుందని పురపాలక శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మార్చి 30,31న సెలవులు ఉన్నప్పటికీ ప్రజల ఆస్తి పన్ను చెల్లించవచ్చని పేర్కొంది. రెండు మూడు రోజుల్లో ఆస్తిపన్ను చెల్లించి వడ్డీపై 90 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ సూచనలు చేసింది.
Also Read: కోలకత్తా జూ.డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరగలేదు..సీబీఐ
Also Read: ఛత్తీస్గడ్లో భారీ ఎన్కౌంటర్.. భీకర కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి
telugu-news | rtv-news | telangana