/rtv/media/media_files/2025/02/28/k9mkeBas81sywhiXs89y.jpg)
PAC Meeting at Gandhi Bhavan
PAC Meeting : రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గాంధీభవన్లో జరిగిన పీఏసీ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..నూతనంగా ఎంపికైన పీసీసీ కార్యవర్గానికి అభినందనలు తెలిపిన రేవంత్ రెడ్డి కార్యకర్త స్థాయి నుంచి అనేకమంది ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, పీసీసీ అధ్యక్షులుగా ఎదిగారన్నారు. పార్టీ లో బాధ్యతలు నిర్వహిస్తే పదవులు వచ్చి తీరుతాయన్నారు. నాకు కాంగ్రెస్ పార్టీ భాధ్యతల తోనే ముఖ్యమంత్రి పదవి దక్కిందని వివరించారు. పార్టీ బాధ్యతలు మోసిన 65 మందికి ప్రభుత్వం లో పదవులు ఇచ్చామని రేవంత్ వివరించారు. పార్టీ పదవులు వచ్చాయని పనిచేయక పోతే వారి ని పీసీసీ అధ్యక్షుడు పక్కన పెడతారని హెచ్చరించారు.
Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్
కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి…స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. మళ్లీ కాంగ్రెస్ అధికారం లోకి తీసుకురావలసిన బాధ్యత మీదేనని కార్యకర్తలకు ఉద్ధేశించి అన్నారు. పార్టీ నిర్మాణం లో వారు బాధ్యత తీసుకోవాలని కోరారు. అధికారం వచ్చిన సంవత్సరంలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న ఆయన 18 నెలల్లో రైతుల కోసం లక్షా నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు. దేశం లో ఏ ప్రభుత్వం రైతుల కోసం ఇంత ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు.విద్యార్థులకు 200 శాతం కాస్మెటిక్ చార్జీలు,40 శాతం డైట్ చార్జీలు పెంచామన్నారు.100 ఏళ్ల కులగణన కలను నెరవేర్చాం..కులగణన చేసి మోడీ ప్రభుత్వానికి సవాల్ విసిరామని రేవంత్ చెప్పుకొచ్చారు.కేంద్రం మెడలు వంచి దేశం లో కులగణన చేపట్టాలని నిర్వహించేలా చేశామన్నారు.
Also Read : మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా..అమెరికాపై దాడులు మొదలెట్టిన ఇరాన్
ఎస్సీ వర్గీకరణ కోసం 35 ఏళ్ళ నుంచి పోరాటం చేశారు..అనేక మంది త్యాగాలు చేశారు. అలాంటి ఎస్సీ వర్గీకరణ చేసి సమస్యకు పరిష్కారం చూపించామని సీఎం వివరించారు.పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను తీసుకొచ్చామని సీఎం వివరించారు. కార్యకర్తలు పార్టీ నిర్మాణం లో క్రియాశీలక పాత్ర పోషించాలి..పార్టీ పదవి అని చిన్న చూపు చూడొద్దు..రేపు గొప్ప అవకాశాలు ఇచ్చేది పార్టీ పదవులేనని స్పష్టం చేశారు.2029 లో పార్టీ 2 వ సారి అధికారం లోకి వస్తే పదవులన్నీ మీకే వస్తాయన్నారు. పార్టీ నాయకులు ప్రజలకు దగ్గరగా ఉండాలన్నారు.18 నెలల మన పాలన గోల్డెన్ పీరియడ్ అని .ప్రజలలోకి తీసుకుపోవాలి..ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య అనుసంధానం గా నాయకులు ఉండాలని సూచించారు.10 ఏళ్ల బీఆర్ ఎస్ పాలనకు,18 నెలల కాంగ్రెస్ పాలన పైన బహిరంగ చర్చకు సవాల్ చేయాలని ,18 నెలల్లో మన ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని రేవంత్ రెడ్డిక కార్యకర్తలకు సూచించారు.
జూబ్లీహిల్స్ పై ప్రత్యేక చర్చ
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఏర్పడిన ఖాళీతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చ జరిగింది. ఉప ఎన్నికల్లో గెలవాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి ఖరాఖండిగా తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నిక కోసం గ్రేటర్ పరిధిలోని నాయకులందరినీ సమన్వయం చేసే బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్కు బాధ్యతలు అప్పజెప్పారు. ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదని చెప్పారు. అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడకూడదని సీఎం ఆదేశించారు.మరోవైపు నిన్న గాంధీ భవన్లో గొర్రెలతో నిరసన చేయడంపై సీఎం చాలా సీరియస్ అయ్యారు. గాంధీ భవన్లో ఇలాంటివి ఎంటర్ టైన్ చేయొద్దని ఆదేశించారు. అలాగే ఇంచార్జి మంత్రుల పనితీరుపై కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే భాధ్యత ఇంచార్జి మంత్రులకు అప్పగించినా చేయడం లేదని అన్నారు.
Also Read : ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం ఎక్కడ? దాడుల విషయం తెలిసి ముందే దాచేసిందా..