Iran: మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా..అమెరికాపై దాడులు మొదలెట్టిన ఇరాన్

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా వచ్చింది. ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేసింది. ఇప్పుడు దానికి ప్రతీకారంగా ఆ దేశం నాలుగు దేశాల్లో యూఎస్ ఆర్మీ బేస్ లపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

New Update
iran attacks

Iran Attacks US

ఇరాన్ ప్రతీకార దాడులను మొదలుపెట్టింది. ఇప్పటికే ఇజ్రాయెల్ మీ దాడులు చేస్తున్న ఇరాన్ ఇప్పుడు అమెరికా మీద కూడా మొదలెట్టింది. యూఎస్ తమ అణు స్థావరాలను ధ్వంసం చేయడంతోనే ఈ అటాక్ లను ప్రారంభించినట్టు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న నాలుగు యూఎస్ మిలటరీ బేస్ ల మీద ఇరాన్ దాడులు చేసిందని వార్తలు వస్తున్నాయి. ఖతార్ తో పాటూ ఇరాక్, బహ్రెయిన్, ఇరాక్, కువైట్ లలో దాడి చేసిందని అంతర్జీతీయ మీడియా తెలిపింది. ఖతార్ రాజధానిలోని దోహాలో పేలుళ్ళు వినిపిస్తున్నాయని చెప్పింది.

నాలుగు దేశాల్లోని యూఎస్ మిలిటరీ బేస్ లపై అటాక్..

ఖతార్ లో ఉన్న అమెరికా మిలటరీ స్థావరం Al Udeid Air base మీ మిస్సైళ్ళతో విరుచుకుపడిందని తెలుస్తోంది.ఇప్పటికే ఆరు క్షిపణులను ప్రయోగించిందని చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్ లో యూఎస్ అతి పెద్ద సైనిక స్థావరం ఇదే.అయితే అమెరికా యుద్ధ విమానాలు ఇక్కడ ఏమీ లేవని..జూన్ మొదటి వారంలో వాటిని ఇక్కడ నుంచి తరలించినట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడ దాదాపు 10 వేలమంది అమెరికన్‌ సైనికులు ఉన్నారని చెబుతున్నారు. ఇరాన్ చేస్తున్న ఈ దాడులకు Bashayer Al-Fath అని పేరు పెట్టినట్లు ఇరాన్ స్టేట్ టీవీ తెలిపింది. 

అమెరికా తమ అణు స్థావరాలపై దాడులు చేసిన తర్వాత ఇరాన్ హెచ్చరించింది. యూఎస్ మొదలుపెట్టిన దాన్ని తాము ముగిస్తామని చెప్పింది. అయితే అమెరికా తమ దేశంపై దాడులు చేస్తుందని భావించింది. అలాగే దాడులు జరిగిన తర్వాత దౌత్యపరమైన పరిష్కారానికే తాము మొగ్గుచూపుతున్నట్లు ట్రంప్ చెప్పారు. టెహ్రాన్‌ ప్రతీకార దాడులు చేస్తే.. మరింత విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు