Pochampally Srinivasa Reddy : ఆ భూమినాదే కానీ...ఎనిమిదేళ్లుగా...ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ పరిధిలోని తోల్కట్ట గ్రామంలో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహించారు. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. కోడి పందేలు నిర్వహించిన ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిదని తేలటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

New Update
Pochampally Srinivasa Reddy

Pochampally Srinivasa Reddy

Pochampally Srinivasa Reddy : హైదరాబాద్ శివారులోని మొయినాబాద్(Moinabad) పరిధిలోని తోల్కట్ట గ్రామంలో ఉన్న ఓ ఫామ్ హౌస్‌లో టెంట్లు వేసి మరీ.. భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహించిన ఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. అయితే.. కోడి పందేలు నిర్వహించిన ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిదని తేలటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఆయనను నిందితునిగా చేర్చుతూ, నోటీసులు జారీ చేశారు. నాలుగు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా.. నోటీసులపై స్పందించిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Also Read :  ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు

 ‘‘నేను 2018లో తోల్కట్ట గ్రామంలో సర్వే నంబర్ 165 లో 10 ఎకరాల 1 గుంట భూమిని రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేశాను. ఆ ప్రాపర్టీని కొనుగోలు చేసినప్పటి నుండి నా తరుపున ఆ భూమికి సంబంధించిన అన్ని వ్యవహారాలను నా మేనల్లుడు జ్ఞాన్‌దేవ్ రెడ్డి చూసుకుంటున్నాడు. నేను ఎమ్మెల్సీగా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నందున.. సదరు భూమికి సంబంధించిన మొత్తం వ్యవహారాలను జ్ఞాన్‌దేవ్ రెడ్డికి అప్పచెప్పాను. మీడియాలో వస్తున్నట్లు సదరు ప్రాపర్టీలో ఎటువంటి ఫామ్‌హౌజ్‌ కానీ గెస్ట్‌ హౌజ్ కానీ లేదు. అక్కడ కేవలం మామిడి, కొబ్బరి తోట, వ్యవసాయ పనిముట్లు పెట్టుకోవడానికి, అక్కడ పనిచేసేవారు ఉండటానికి రెండు గదులు మాత్రమే ఉన్నాయి’’ అని శ్రీనివాస్ రెడ్డి వివరించారు.

Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!

అయితే తన ప్రమేయం లేకుండానే తోటను జ్ఞాన్‌దేవ్ రెడ్డి, వర్రా రమేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి కౌలుకి ఇచ్చినట్లు తనకు తెలిసిందన్నారు.జ్ఞాన్‌దేవ్ రెడ్డిని విచారించగా తన ఆధీనంలో ఉన్న ఆ తోటను వర్రా రమేష్ కుమార్ రెడ్డి, ఎం వెంకటపతి రాజుకి కౌలుకు ఇచ్చినట్లు చెప్పాడన్నారు.  అయితే ఈ విషయాలన్ని  సంఘటన జరిగిన తర్వాతే తన దృష్టికి వచ్చిందన్నారు.వాటితో తనకు ఎటువంటి సంబంధం లేదు. ఇట్టి విషయంలో సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా నిన్ననే పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించారు. కేవలం రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికే కొందరు తనపై దుష్ప్రచారం మొదలుపెట్టారన్న శ్రీనివాసరెడ్డి 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో తనపై ఒక చిన్న కేసు కూడా లేదన్నారు. ఒకవేళ సదరు తోటలో అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా జరిగి ఉంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానన్నారు. ఆ భూమికి యజమాని నేనే అయినప్పటికీ గత ఎనిమిదేండ్లుగా నేను అటువైపు వెళ్లలేదని, అన్ని తన అల్లుడే చూసుకుంటున్నాడని వివరించారు. పోలీసులకు ఎలాంటి సమాచారం కావాలన్న తాను సహకరిస్తానని వెళ్లడించారు.  

Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!

ఇదిలా ఉంటే.. శ్రీనివాస రెడ్డికి చెందిన తోటలో ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలానికి చెందిన వ్యాపారి భూపతిరాజు, శివకుమార్‌ వర్మ అలియాస్‌ గబ్బర్‌సింగ్‌ పందేలు నిర్వహించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకోగా ఇందులో.. నిర్వాహకులు భూపతి రాజు, శివకుమార్‌ని కూడా అరెస్ట్ చేశారు.
ఫామ్‌హౌస్‌పై పోలీసులు చేసిన దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు. యూపీఐ ట్రాన్సక్షన్ల కోసం ఆర్గనైజర్లు స్కానర్లు వినియోగించినట్లు పోలీసులు తేల్చారు. యూపీఐ ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు.

 Also read :  మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!

అయితే.. పందేలు నిర్వహించింది ఏపీకి చెందిన భూపతిరాజు, శివకుమారే అయినప్పటికీ.. ఫామ్‌హౌస్ యజమాని ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి కావటంతో.. పోలీసులు ఆయనకే నోటీసులు ఇచ్చారు. నాలుగు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పోచంపల్లిపై సెక్షన్‌-3 అండ్‌ గేమింగ్‌ యాక్ట్‌, సెక్షన్‌-11 యానిమల్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Also Read :  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి బిగ్ షాక్.. పోలీసులు నోటీసులు
 

Advertisment
Advertisment
తాజా కథనాలు