PM Modi : రోడ్డు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి: మృతులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా!

చేవెళ్ల ప్రమాదంపై  ప్రధాని నరేంద్రమోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మృత్యువాత పడిన వారి కుటుంబాలకు, ఈ క్లిష్ట సమయంలో బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

New Update
PM Modi

PM Modi

చేవెళ్ల ప్రమాదంపై  ప్రధాని నరేంద్రమోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మృత్యువాత పడిన వారి కుటుంబాలకు, ఈ క్లిష్ట సమయంలో బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు పరిహారం

రంగారెడ్డి ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 పరిహారం ప్రకటించారు మోదీ.  గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని తాను ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. చేవెళ్ల RTC బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా అందిచనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 

తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైనందున, మృతుల్లో ఎక్కువమంది తాండూరు ప్రాంతానికి చెందినవారు కావడంతో, ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
  

Advertisment
తాజా కథనాలు