/rtv/media/media_files/2024/11/25/KbxBAkfsRVelR3IHn1GL.jpg)
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ రోడ్ గేట్లను ఇక నుంచి ప్రతిరోజూ రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంతకు ముందు వరకు ఈ గేట్లను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మూసి ఉంచేవారు. దీంతో బయటకు వెళ్లినప్పుడు తిరిగి వచ్చే సమయానికి గేట్లు మూసి ఉంచడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చాలా మంది విద్యార్థులు తెలిపారు.
Also Read: Parliament Sessions: ప్రారంభమైన శీతాకాలం సమావేశాలు..చర్చకు 17 బిల్లులు
దీంతో ఈ విషయం గురించి వీసీ ప్రొఫెసర్ కుమార్ కు వినతలు సమర్పించారు. దీంతో ఆయన విషయం గురించి స్పందించారు. బయటివ్యక్తులు, బయటి వాహనాల రాకపోకలు పెరిగి క్యాంపస్ వాతావరణానికి విఘాతం కలుగుతోందని, విద్యార్థులు, ఉద్యోగులకు బయట నుంచి వచ్చేవాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని మూడేండ్ల కింద వీసీగా ఉన్నప్పుడు ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ఎన్సీసీ గేటుతో పాటు ఓయూ పీఎస్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Also Read: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే..వానలు
ఎన్సీసీ గేటును రోజూ రాత్రి 8గంటలకు మూసి ఉదయం 8 గంటలకు తెరిచేవారు. అప్పట్లో విద్యార్థులు ఆందోళన చేసినప్పటికీ ఎవరూ స్పందించలేదు. గేట్లు మూసివేసే సమయాన్ని గంటపాటు పొడిగించాలని కోరినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు.
Also Read: Iran: విమానాల మీద నుంచి ఇరాన్ క్షిపణులు–చూసిన పైలట్లు, ప్రయాణికులు
తాజాగా వీసీగా ప్రొఫెసర్ కుమార్ బాధ్యతలు చేపట్టాక విద్యార్థుల కోరిక మేరకు రెండు వైపులా గేట్లను రాత్రి 9గంటల వరకు తెరిచి ఉంచేందుకు అధికారులు అంగీకరించారు.