ఆపరేషన్ సిందూర్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నానన్నారు. ఉగ్రవాదం మరియు ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా... ప్రపంచ మానవాళికి నష్టమే తప్ప లాభం చేకూర్చదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం అంతం కావాల్సిందేనన్నారు. ఈ విషయంలో పాజిటివ్గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై ఉగ్రవాదాన్ని అంతమొందించాలన్నారు. తద్వారా శాంతి, సామరస్యాలు నెలకొంటాయన్నారు.
భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా నేను గర్వపడుతున్నాను.
— BRS Party (@BRSparty) May 7, 2025
ఉగ్రవాదం మరియు ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా.. ఏ దేశంలో ఉన్నా.. ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేది కాదు.
ఉగ్రవాదం అంతం కావాల్సిందే.
ఈ విషయంలో పాజిటివ్ గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ…
వీరోచితంగా దాడులు..
భారత సైన్యం ఎంత వీరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా ఉండి దేశరక్షణలో మేమెవరికి తీసిపోము అన్నట్టుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
(telugu-news | telugu breaking news | operation Sindoor kcr)