ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావు లేదన్నారు. అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
మన దేశ భద్రతా బలగాలకు అండగా తెలంగాణ. ...
— Ayodhya Reddy Boreddy (@ayodhya_boreddy) May 7, 2025
ప్రభుత్వ యంత్రాంగంతో HCM @revanth_anumula సమీక్ష. ..@TelanganaDGP@TelanganaCMO@Vemnarenderredy@oratorgreatpic.twitter.com/tnLwyHwmvF
మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలన్నారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో @TelanganaCMO రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం.హాజరైన ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, @TelanganaDGP జితేందర్,హోమ్ సెక్రటరీ రవి గుప్తా,ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్,ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు. pic.twitter.com/zT1iryCeI5
— IPRDepartment (@IPRTelangana) May 7, 2025
24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలి వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్ధం చేసుకోవాలన్నారు. అత్యవసర మెడిసిన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ ల అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలన్నారు. రెడ్ క్రాస్ సంస్థతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలన్నారు. సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఫేక్ న్యూస్ పై అప్రమత్తంగా ఉండాలి..
ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందన్నారు. ఫేక్ న్యూస్ ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. రాజధాని లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాల ను కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రతను పెంచాలన్నారు. హైదరాబాద్ లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భద్రతను పెంచాలన్నారు. ఐటీ సంస్థల వద్ద కూడా అప్రమత్తంగా ఉండాలని.. పోలీసులకు సూచించారు. అవసరమైతే పీస్ కమిటీ లతో మాట్లాడాలన్నారు. పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండాలన్నారు.
(operation Sindoor | telugu-news | telugu breaking news | cm-revanth-reddy)