/rtv/media/media_files/2025/03/24/dmVJRS9n2ZVvnxtzK7OC.jpg)
Bandi Sanjay Vs KCR
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన పాపాల కారణంగా పోలీసుల నుంచి ఆయనకు నోటీసులు వచ్చాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని జూబ్లీహిల్స్ ఏసీపీ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సిట్ నుంచి పిలుపు. ఈ నెల 24వ తేదీన స్టేట్మెంట్ ఇవ్వాలని కోరిన అధికారులు. లేక్ వ్వూ అతిథి గృహాంలో తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలని కోరిన బండి సంజయ్#phonetappingcase#Bandisanjay#Telanganapic.twitter.com/VtLhNrZhyi
— Telugu7AM News (@Telugu7amNews) July 17, 2025
బండి సంజయ్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయి. నాతో పాటు నా కుటుంబం, సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. పడకగదిలో దంపతుల మాటలూ ట్యాప్ చేసి జీవితాలను నాశనం చేశారు. నాకు తెలిసిన, నా వద్ద ఉన్న సమాచారం పోలీసులకు తెలియజేస్తానని బండి సంజయ్ అన్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన విచారణ కోసం సిట్ అధికారుల ముందుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి జూలై 24న ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలని నోటీసులు వచ్చాయి.