Telangana Politics: ఉరికించి కొడతాం.. బీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ సీరియస్ వార్నింగ్..!
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి ఉగ్రరూపం దాల్చారు. ఉరికించి కొడతామంటూ తనదైన శైలిలో బీఆర్ఎస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పై ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాడి చేయడంపై సీరియస్ గా రియాక్ట్ అయిన ఆయన.. బీఆర్ఎస్ నేతలకు ఈ విధంగా వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ నేతలకు సంస్కారం ఉందని, అది పక్కన పెడితే బీఆర్ఎస్ నేతలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్.