/rtv/media/media_files/2025/02/23/yqx0zTihMWKcvUB6CHxN.webp)
New Liquor
New Liquor Brands: మందుబాబులకు గుడ్ న్యూస్. తెలంగాణలో ఇప్పటికే పలు కంపెనీల లిక్కర్ అమ్మకాలు సాగుతుండగా, మరిన్ని కొత్త కంపెనీల లిక్కర్ ను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు కొత్త బ్రాండ్స్ కంపెనీల నుంచి ధరఖాస్తులను ఆహ్వానించింది. అన్ని అనుకూలిస్తే మరో నెలలోనే కొత్త బ్రాండ్లు తెలంగాణలో కొలువుతీరనున్నాయి.
Also Read: మైనర్ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
టీజీబీసీఎల్ (తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్) తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్స్ ను ఆహ్వానించడానికి అవసరమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఆదేశించిన రీతిలో కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనున్నారు. తెలంగాణలో లేని విదేశీ, దేశీయ లిక్కర్ బీర్ కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్ల అమ్మకాలు జరుపుకోవడానికి కొత్త కంపెనీల నుంచి టీజీ బీసీఎల్ దరఖాస్తులను స్వీకరించనుంది. టీజీబీసీఎల్ లో రిజిస్టర్ కానీ కొత్త కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో జరుపుతున్న తమ మద్యం అమ్మకాలపై నాణ్యత ప్రమాణాలతో అమ్మకాలు జరుపుతున్నట్లుగా మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేవని నిర్ధారణ సర్టిఫికేషన్ పత్రం దరఖాస్తులో జతపరచాలని టీజీ బీసీఎల్ కోరింది. తెలంగాణలో పలు కొత్త కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి టీజీబీసీఎల్ కొందరికి అనుమతులు ఇవ్వడం జరిగింది. కానీ కొత్త కంపెనీలపై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన కొత్త బ్రాండ్లను నిలిపివేసిన విషయం విధితమే.
Also Read: MLC ఎన్నికలకు దూరం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన!
తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల ఆహ్వానించడానికి కొత్త విధానానికి ప్రభుత్వం నాంది పలికింది. కొత్త దరఖాస్తులను ఆహ్వానించే ముందు బహిరంగ ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం టీజీ బీసీలకు నిర్దేశించింది. టీజీబీసీఎల్ తెలంగాణలో రిజిస్టర్ కానీ కొత్త సప్లయర్స్ నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి ప్రకటన జారీ చేసింది. కొత్త కంపెనీల నుంచి వచ్చిన దరఖాస్తులను పది రోజులపాటు ఆన్లైన్లో పెట్టాలని టీజీబీసీఎల్ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులపై వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరిపి అనంతరం అనుమతులపై టీజీబీసీఎల్ నిర్ణయం తీసుకోనుంది. టీజీబీసీఎల్ లో రిజిస్టర్ కాబడి సరఫరా చేస్తున్న సప్లయర్స్ మాత్రం ప్రస్తుతం ఉన్న పద్ధతిలోనే కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ కొత్త మద్యం బ్రాండ్లపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ తెలిపింది.
Also Read: సీఎం రేవంత్కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!
తెలంగాణ మద్యం విధానంలో మార్పులు జరగనున్నాయి. ఈ క్రమంలో కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ విధానంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా మద్యం కొత్త బ్రాండ్ల కంపెనీపై ప్రభుత్వం సమీక్ష చేపట్టింది. రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టీజీబీసీఎల్కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని చెప్పారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టంగా ఉండాలని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి.. కనీసం నెల రోజులు నిర్ణీత గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని.. ఆ కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Telangana: ఇద్దరు ఐపీఎస్ అధికారులు రిలీవ్.. జీవో జారీ