/rtv/media/media_files/2025/02/26/zt62OhWRrRX61v7piX6u.jpg)
SLBC Tunnel
ఎస్ఎల్బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతం భయంకరమైన ఊబిలా మారింది. నిన్న పరిస్థితిని అంచనా వేయడానికి 34 మందితో కూడిన సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ల ప్రత్యేక బృందం సొరంగంలోకి వెళ్లింది. సహాయక చర్యలు చేపట్టానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేదని ర్యాట్ మఓల్ మైనర్స్ చెబుతున్నారు. పైకప్పు కూలినచోట 70% బురద, 30% నీళ్లు ఉండటంతో అక్కడ అడుగు వేయడానికి వీలులేకుండా ఉందని తెలిపారు. 13.85 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి 40 మీటర్లు సహాయ చర్యలకు సవాల్గా మారిందని ఎన్డీఆర్ఎఫ్ బృందం వివరించింది. పై నుంచి బండరాళ్ళు కూలడం వలన అక్కడంతా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయిని చెప్పారు. సొరంగం లోపల నీరు కన్నా బురద శాతం ఎక్కువగా ఉందని..దీని వలన కాళ్ళు, చేతులు కదిలించే పరిస్థితి లేదని తెలిపారు.
మట్టి, బురద..నో ఆక్సిజన్..
టన్నెల్ చివరిలో పైకప్పు నుంచి మట్టి ఇంకా పడుతూనే ఉంది. దీంతో 15 అడుగుల స్థాయిలో ఊబిలాంటి బురద ఉండటం, చిమ్మ చీకటి, గాలి లేకపోవడంతో ఎలాంటి సహాయ చర్యలు చేపట్టడానికి వీలులేదని ర్యాట్ హోల్ మైనర్స్ అప్డేట్ ఇచ్చారు. డ్రోన్స్ కూడా ఆ ప్రాంతానికి చేరుకోలేవని అన్నారు. టన్నెల్ లో 12వ కి.మీ దాటిన తర్వాత బురద, నీళ్ళల్లో నడిచి వెళ్ళాల్సి రావడంతో రక్షణ బృందాలు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. ఒకవేళ అలా వెళ్ళడానికి ట్రై చేసినా కూడా అక్కడ ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు. దీంతో ముందు వెళ్లాలంటేనే సహాయక బృందాలు భయపడుతున్నాయి. సొరంగంలో 3 కి.మీ. వరకు బీఎస్ఎన్ఎల్ సిగ్నళ్లు వస్తున్నాయి. కొంతదూరం వరకు ఇంట్రకాం, మరికొంత దూరం వరకు నిర్మాణ సంస్థకు చెందిన వైఫై పని చేస్తున్నాయి. తమకు ఆక్సిజన్ సిలిండర్లు అందజేస్తే చివరివరకు చేరుకుంటామని ర్యాట్ హోల్ మైనర్లు చెబుతున్నారు.
Also Read: CM Revanth: నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ