Telangana: శ్రీశైలం, నాగార్జునా సాగర్ కు భారీ వరద నీరు..గేట్లు ఎత్తిన అధికారులు
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో శ్రీశైలం జలాశయంలో ఆరు గేట్లను, నాగార్జునా సాగర్ లో 16 గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు.