నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడుతారు: అసదుద్దీన్ ఓవైసీ
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్లాన్ను నేను వద్దని చెప్పలేదా ? నేను నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బందులు పడతారని'' అసదుద్దీన్ అన్నారు.
మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పేదవాళ్ల ఇల్లు కూల్చేస్తున్నారంటూ ఇటీవల బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్లాన్ను నేను వద్దని చెప్పలేదా ? అని వ్యాఖ్యానించారు. నేను నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బందులు పడతారన్నారు. ఇళ్ల జోలికి రాకుండా మూసీ ప్రక్షాళన చేస్తే స్వాగతిస్తామని తెలిపారు.
బీఆర్ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలంటూ సూచించారు. వాళ్లకి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు ఆ పార్టీకి జీహెచ్ఎంసీలో ఎక్కువ సీట్లు రావడానికి కారణం మేమేనని తెలిపారు. ఎంఐఎం మద్దతుతోనే బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వచ్చాయని.. 24 మంది ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బీఆర్ఎస్ మళ్లీ గెలిచేదని అన్నారు. ఆ పార్టీలో నేతలకు అప్పట్లో అహంకారం ఉండేదన్నారు. మరోవైపు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చంద్రబాబు నాయుడు, ,స్టాలిన్ అంటున్నారని.. ఒకవేళ ఈ విషయం నేను చెప్పితే నానా రాద్ధాంతం చేసేవారన్నారు.
దక్షిణ భారత్లో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారని.. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలే నష్టపోతాయని తెలిపారు. అసెంబ్లీ, లోక్సభ స్థానాల సంఖ్య తగ్గడ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని అన్నారు. దేశ అభివృద్ధిలో బాగా పనిచేసిన రాష్ట్రాలను శిక్షించడం వల్ల ఏం లాభం అంటూ ప్రశ్నించారు.
ఇదిలాఉండగా.. కేంద్రప్రభుత్వం ఇటీవల 2025లో జనగణన, 2028 నాటికి డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల జనాభాను నియంత్రించని ఉత్తరాది రాష్ట్రాలకే లాభం ఉంటుందని.. జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టం గురించి ఇంతవరకు స్పందించలేదు. అయితే ఇటీవల చంద్రబాబు, స్టాలిన్లు ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే అంశాన్ని తీసుకురావడం చర్చనీయాంశమవుతోంది.
నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడుతారు: అసదుద్దీన్ ఓవైసీ
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్లాన్ను నేను వద్దని చెప్పలేదా ? నేను నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బందులు పడతారని'' అసదుద్దీన్ అన్నారు.
మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పేదవాళ్ల ఇల్లు కూల్చేస్తున్నారంటూ ఇటీవల బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్లాన్ను నేను వద్దని చెప్పలేదా ? అని వ్యాఖ్యానించారు. నేను నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బందులు పడతారన్నారు. ఇళ్ల జోలికి రాకుండా మూసీ ప్రక్షాళన చేస్తే స్వాగతిస్తామని తెలిపారు.
Also Read: కేటీఆర్ మెడకు మరో ఉచ్చు.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు
అలా చేసుంటే బీఆర్ఎస్ గెలిచేది
బీఆర్ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలంటూ సూచించారు. వాళ్లకి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు ఆ పార్టీకి జీహెచ్ఎంసీలో ఎక్కువ సీట్లు రావడానికి కారణం మేమేనని తెలిపారు. ఎంఐఎం మద్దతుతోనే బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వచ్చాయని.. 24 మంది ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బీఆర్ఎస్ మళ్లీ గెలిచేదని అన్నారు. ఆ పార్టీలో నేతలకు అప్పట్లో అహంకారం ఉండేదన్నారు. మరోవైపు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చంద్రబాబు నాయుడు, ,స్టాలిన్ అంటున్నారని.. ఒకవేళ ఈ విషయం నేను చెప్పితే నానా రాద్ధాంతం చేసేవారన్నారు.
దక్షిణ భారత్లో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారని.. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలే నష్టపోతాయని తెలిపారు. అసెంబ్లీ, లోక్సభ స్థానాల సంఖ్య తగ్గడ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని అన్నారు. దేశ అభివృద్ధిలో బాగా పనిచేసిన రాష్ట్రాలను శిక్షించడం వల్ల ఏం లాభం అంటూ ప్రశ్నించారు.
Also Read: డిసెంబర్ లో సర్పంచ్ ఎన్నికలు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ఇదిలాఉండగా.. కేంద్రప్రభుత్వం ఇటీవల 2025లో జనగణన, 2028 నాటికి డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల జనాభాను నియంత్రించని ఉత్తరాది రాష్ట్రాలకే లాభం ఉంటుందని.. జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టం గురించి ఇంతవరకు స్పందించలేదు. అయితే ఇటీవల చంద్రబాబు, స్టాలిన్లు ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే అంశాన్ని తీసుకురావడం చర్చనీయాంశమవుతోంది.
Telangana Rain Update: తెలంగాణలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో దంచుడే దంచుడు
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం,.. Short News | Latest News In Telugu | తెలంగాణ
Telangana Villages : బిగ్ షాక్.. తెలంగాణలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం !
మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 14 గ్రామాలు Short News | Latest News In Telugu
Kavitha : ఎమ్మెల్సీ కవితకు కేటీఆర్ బిగ్ షాక్..ఊహించని ట్విస్ట్!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిగ్ షాకిచ్చారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇంఛార్జ్గా మాజీ Short News | Latest News In Telugu | తెలంగాణ
BIG BREAKING: హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన కంపెనీ
హైదరాబాద్లోని బాలానగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డ్యూరో డైన్ ఇండస్ట్రీలో దట్టమైన నల్లటి పొగ, మంటలతో ఆ ప్రాంతమంతా చికటిగా మారింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
TG New Ration Card Status: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ఒక్క క్లిక్ తో మీ కార్డు డౌన్లోడ్ చేసుకోండిలా!
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మీకు కొత్త రేషన్ కార్డు మంజూరైందా? లేదా? ఇలా తెలుసుకోండి. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
RFCL : రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీలో అమ్మోనియా లీక్.. ప్లాంట్ మూసివేత
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సీఎల్ లో బుధవారం సాయంత్రం అమ్మోనియా వాయువులు లీక్ అయ్యాయి. క్రైం | Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
USA: అలా చేస్తే వీసాలు క్యాన్సిల్..యూఎస్ ఎంబసీ వార్నింగ్
World Emoji Day 2025: ఒక నవ్వు నుంచి వేల భావాలు.. పాపులర్ ఎమోజీ ఏంటో తెలుసా?
🔴Live News Updates: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Telangana Rain Update: తెలంగాణలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో దంచుడే దంచుడు
Imran Khan: నాకేమైనా జరిగితే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ దే బాధ్యత.. ఇమ్రాన్ ఖాన్