MLC Kavitha Comments: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కవిత సంచలన కామెంట్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఇది జరిగిందంటూ ఆరోపించారు. తనపై ఢిల్లీలో ఉన్నప్పుడే కుట్రలు జరిగాయని తెలిపారు. 

author-image
By Krishna
New Update
kavitha comments

MLC Kavitha Comments

MLC Kavitha Comments: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం(BRS Merge with BJP) చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఇది జరిగిందంటూ ఆరోపించారు. ఢిల్లీలో ఉన్నప్పుడే తనపై కుట్రలు జరిగాయని కవిత తెలిపారు. మీడియాతో గురువారం ఎమ్మెల్సీ కవిత చిట్‌చాట్ చేశారు.  తన మీద పడి ఏడిస్తే మీకు ఏం వస్తుంది. ఆడబిడ్డ మీద  ఏంటీ మీ ప్రతాపమూ అని ప్రశ్నించారు.

 జైలుకు వెళ్లినప్పుడే తాను పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పానని, కానీ కేసీఆర్ ను ఏం చేయలేక నీ మీద కేసులు పెడుతున్నారని చెప్పారని  కవిత అన్నారు. లీకు వీరులను పట్టుకోండి అంటే గ్రీకు వీరులు తనపై దాడి చేస్తున్నారని కవిత వాపోయారు.  మీ తెలివి ప్రతిపక్ష నేతలపై చూపించండి.. తన జోలికి వస్తే  బాగుండదు.. తాను అసలే మంచిదాన్ని  కాదన్నారు.

Also Read: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి

తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలకు పార్టీ స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.  తన లేఖను లీక్ చేసిందో ఎవరో చెప్పాలన్నారు కవిత. కేసీఆర్‌కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు లేవని ప్రశ్నించారు.  తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలను పార్టీ ఎందుకు ఖండించడం లేదని ఆమె నిలదీశారు.  పార్టీ చేయాల్సిన సగం పనులు జాగృతి తరఫున తాను చేస్తున్నానని వెల్లడించారు. కాంగ్రెస్ తో రాయాబారాలు చేసే అవసరం తనకు లేదన్న కవిత..  తనను కేసీఆర్ కు దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో నన్ను కావాలనే ఓడించారని కవిత ఆరోపించారు. నన్ను పార్టీకి దూరం చేస్తే ఎవరికి మంచిదో అందరికీ తెలిసిందేనని తెలిపారు.  ఆమె చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. 

Also Read: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి

Advertisment
Advertisment
తాజా కథనాలు