పార్టీ మీటింగ్ కోసం శుక్రవారం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్కు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అస్వస్థతకు గురైయ్యారు. సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మార్చి 7న పార్టీ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫుడ్ పాయిజన్కు గురైయ్యారు.
నిన్న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు. సమావేశం అనంతరం తిరుగు ప్రయాణంలో ఆమె అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే సబితా ఇంద్రా రెడ్డిని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు ఆమెకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఫుడ్ పాయిజన్ వల్లే అస్వస్థకు గురైందని నిర్థారించినట్లు సమాచారం.