farmhouse meeting: KCR ఫామ్ హౌస్‌కు వెళ్లిన ఎమ్మెల్యే హాస్పిటల్‌పాలు

ఎర్రవల్లి ఫామ్‌హౌస్ మీటింగ్‌కు వెళ్లిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అస్వస్థత చెందారు. సమావేశం అనంతరం తిరిగివస్తుండగా ఆమె అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఆమెను హాస్పిటల్‌లో చేర్పించారు. ఫుడ్ పాయిజన్ వల్లే ఆమెకు ఇలా అయ్యిందని డాక్టర్లు తెలిపారు.

New Update

పార్టీ మీటింగ్ కోసం శుక్రవారం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అస్వస్థతకు గురైయ్యారు. సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మార్చి 7న పార్టీ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫుడ్ పాయిజన్‌కు గురైయ్యారు.

నిన్న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లారు. సమావేశం అనంతరం తిరుగు ప్రయాణంలో ఆమె  అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే సబితా ఇంద్రా రెడ్డిని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఆమెకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఫుడ్ పాయిజన్ వల్లే అస్వస్థకు గురైందని నిర్థారించినట్లు సమాచారం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు