ఈరోజు చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ లీడర్ కేసీఆర్ బయటకు వచ్చారు. వస్తూనే ప్రస్తుత కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కాంగ్రెస్ ను తెగ విమర్శించారు. దీనిపై ఆ పార్టీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ముఖ్యంగ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టారు. ఆయన పదేళ్ళు సీఎంగా ఉన్నారు కదా..మరెందుకు పాలమూరు, ఎస్ఎల్బీసీ, దిండి ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు, దిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల ప్రజలు కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారు. అవాస్తాలు చెప్పడం కేసీఆర్ కు తగదని ఉత్తమ్ ఆరోపించారు. రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చినా.. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదు. కృష్ణా జలాలు కాపాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థంగా ముందుకెళ్తోంది. కృష్ణా జలాల విషయంలో పాలమూరు, నల్గొండ జిల్లాలకు అన్యాయం చేసింది కేసీఆరే అంటూ ఉత్తమ్ దుయ్యబట్టారు.
అసలెలా మాట్లాడుతున్నారు..
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల్లో ముంచేశారు. దానికి ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి ఉత్తమ్ అన్నారు. కాళేశ్వరం బ్యారేజ్ కూలిపోవడానికి కారణం కేసీఆరే. కూలిపోయిన ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం నిర్మాణ తీరును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సుప్రీంకోర్టు జడ్జి కూడా తప్పుబట్టారు. కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టు అంచనాలు పెంచారు అని మంత్రి ఉత్తమ్ విమర్శనాస్త్రాలు సంధించారు.
Minister Uttam: పాలమూరు, దిండి ప్రాజెక్టుు ఎందుకు పూర్తి చేయలేదు..మంత్రి ఉత్తమ్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పాలమూరు, ఎస్ఎల్బీసీ, దిండి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
Uttam Kumar Reddy
ఈరోజు చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ లీడర్ కేసీఆర్ బయటకు వచ్చారు. వస్తూనే ప్రస్తుత కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కాంగ్రెస్ ను తెగ విమర్శించారు. దీనిపై ఆ పార్టీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ముఖ్యంగ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టారు. ఆయన పదేళ్ళు సీఎంగా ఉన్నారు కదా..మరెందుకు పాలమూరు, ఎస్ఎల్బీసీ, దిండి ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు, దిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల ప్రజలు కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారు. అవాస్తాలు చెప్పడం కేసీఆర్ కు తగదని ఉత్తమ్ ఆరోపించారు. రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చినా.. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదు. కృష్ణా జలాలు కాపాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థంగా ముందుకెళ్తోంది. కృష్ణా జలాల విషయంలో పాలమూరు, నల్గొండ జిల్లాలకు అన్యాయం చేసింది కేసీఆరే అంటూ ఉత్తమ్ దుయ్యబట్టారు.
అసలెలా మాట్లాడుతున్నారు..
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల్లో ముంచేశారు. దానికి ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి ఉత్తమ్ అన్నారు. కాళేశ్వరం బ్యారేజ్ కూలిపోవడానికి కారణం కేసీఆరే. కూలిపోయిన ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం నిర్మాణ తీరును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సుప్రీంకోర్టు జడ్జి కూడా తప్పుబట్టారు. కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టు అంచనాలు పెంచారు అని మంత్రి ఉత్తమ్ విమర్శనాస్త్రాలు సంధించారు.