RTC డ్రైవర్‌ని చితకబాదిన వ్యక్తి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల దగ్గర సిరిసిల్ల డిపో ఆర్టీసీ బస్సు వెనకాల పిట్టల శ్రీకాంత్ కారులో వస్తున్నాడు.  సైడ్ ఇవ్వలేదనే కారణంతో బస్సును చేజ్ చేసి ఆపీ ఆపాడు. ఆవేశంతో శ్రీకాంత్ బస్ డ్రైవర్ బాలరాజును కాలితో తన్ని చితకబాదాడు.

New Update
attack on bus driver

ఆర్టీసీ బస్సు సైడ్ ఇవ్వలేదని ఓ కారు నడుపుతున్న వ్యక్తి డ్రైవర్‌పై దాడి చేశాడు. ఈ ఘటనపై రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. ఆర్టీసీ బస్సుకు కారు అడ్డుగా పెట్టి మరి బస్సుని ఆపి.. డ్రైవర్‌ను చితకబాదాడు. డ్రైవర్ పై పిడిగుద్దులు గుద్దుతూ.. కాలితో తన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఆర్టీసీ కార్మికులపై చేయి చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల దగ్గర సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనకాల పిట్టల శ్రీకాంత్ అనే వ్యక్తి కారులో వస్తున్నాడు.  సైడ్ ఇవ్వలేదనే కారణంతో బస్సును చేజ్ చేసి ఆపీ ఆపాడు. తర్వాత ఆవేశంతో శ్రీకాంత్ బస్సులోకి వెళ్లి బస్ డ్రైవర్ బాలరాజును కాలితో తన్ని చితకబాదాడు. ప్రయాణికుల ఎదుటే బస్ డ్రైవర్ బాలరాజును చితక్కొట్టాడు. అదంతా బస్సులో ప్రయాణీకులు వీడియోలు తీశారు. ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆర్టీసీ డ్రైవర్ బాలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న కారు డ్రైవర్ శ్రీకాంత్ ను పట్టుకునే పనిలో ఉన్నారు. 

ఈ ఘటనపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగిపై ఉద్దేశ్య పూర్వకంగా దాడి చేయడం హేయమైన చర్య అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్‌లో మాట్లాడారు. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికుల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆర్టీసీ సోదరులపై దాడి ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.  భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ మనోధైర్యాన్ని ప్రకటించారు.

Advertisment
తాజా కథనాలు