/rtv/media/media_files/l1JVRjMeK0AB66qjXv3s.jpg)
Telangana: ఈ నెల 9 న తెలంగాణ బంద్ పాటించాలని మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఓ కీలక లేఖను విడుదల చేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక సమీప అడవుల్లోని పోకలమ్మ వాగు దగ్గర జరిగిన పాశవిక హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల 9వ తేదీన తెలంగాణలో బంద్ పాటించాలన్నారు.
Also Read: Ram Mohan Naidu: సుధామూర్తి అమ్మ ప్రేమ..ముగ్ధుడైన ఏపీ మంత్రి!
గత నెల 30న చెల్పాక పంచాయతీలోని ఓ ఆదివాసీ గ్రామంలో ఏడుగురు సాయుధులను దగ్గరి నుంచి అతి కిరాతకంగా కాల్చి చంపారని ఆయన ఆవేదన చెందారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఓ సంఘ విద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా ఏటూర్ నాగారం మండలం, చెల్పాక గ్రామ పంచాయితీ అడవుల్లో పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతంగా చంపిన విషయం తెలిసిందే.
Also Read: Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు మరో 28 స్పెషల్ ట్రైన్లు
నవంబర్ 30వ తేదీ సాయంత్రం ఏడుగురితో ఉన్న మా దళం చల్చాక పంచాయితీలో ఉన్న వలస ఆదివాసీ గ్రామంలోని ఓ నమ్మిన వ్యక్తికి తినడానికి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు. ముందుగానే పోలీసులకు అప్రోవర్గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం కలిపించి స్పృహ కోల్పోయే లాగా చేశారు. ఆ తరువాత కామ్రేడ్స్ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారుజామున 4 గంటలకు అతి సమీపం నుండి కాల్చి చంపారు.
Also Read: Bangladesh: జైళ్ల నుంచి 700 మంది పరారీ..బంగ్లాలో మరో కొత్త తలనొప్పి!
ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరకులకు పేరు పేరున తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుంది'అన్నారు.'కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యకాండను తీవ్రంగా ఖండిస్తూ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నది. యావత్ పీడత ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యాలయాలు, తదితర వ్యాపార సంస్థలు బంద్ను పాటించి జయప్రదం చేయాలని కోరుతున్నది.
Also Read: AP: అన్నదాత సుఖీభవ...రైతుల అకౌంట్ లో రూ.20 వేలు!
ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్లకు అత్యంత విశ్వాసంగా కొమ్ముకాస్తుంది. వారి లాభాల కోసమే దోపీడీ విధానాలను అమలు చేస్తున్నది.
అందులో భాగంగానే ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డంకిగా మారిన ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికి ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీని, పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ కగార్ను సాగిస్తున్నారు.
రఘునాథపాలెం, పోల్ కమ్మ వాగు,దామెరతోగు వంటి వరుస ఎన్ కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న ఈ పాశవిక దాడులను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు తీవ్రంగా ఖండించాలంటూ లేఖను విడుదల చేశారు.