/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-4.jpg)
Bangladesh: బంగ్లాదేశ్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని నెలల క్రితం అప్పటి ప్రధాన మంత్రి షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో జైలు నుంచి వందల మంది టెర్రరిస్ట్ లు,ఉరిశిక్ష పడిన హంతకులు,ఇతర నేరస్థులు చాలా మంది పరారయ్యారు.
Also Read: డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారంలో శిండే సొంత ప్రసంగం..షాక్ అయిన నేతలు
అలా పారిపోయిన వారి ఆచూకీ ఇప్పటికీ కనిపించడం లేదు. వారి జాడ ఇప్పటికీ తెలియకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని.. అధికారులు అంటున్నారు.
Also Read: హైదరాబాద్లో ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం భారీగా నిధులు విడుదల
బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమం సమయంలో జైళ్లను బద్ధలు కొట్టి భారీగా కరుడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన హంతకులు పారిపోయారు. వారిలో 700 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని బంగ్లాదేశ్ జైలు అధికారులు వెల్లడించారు. ఇక హసీనాపై తిరుగుబాటు జరిగిన సమయంలో చెలరేగిన ఆందోళనల్లో దేశ వ్యాప్తంగా 2200 మంది ఖైదీలు తప్పించుకున్నట్లు జైళ్ల శాఖ చీఫ్ సయీద్ మహమ్మద్ మోతెర్ హోసైన్ ప్రకటించారు. పారిపోయిన 2200 మందిలో దాదాపు 1500 మందిని.. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ భద్రతా దళాలు తిరిగి పట్టుకొని జైళ్లకు తరలించినట్లు జైళ్ల శాఖ చీఫ్ వివరించారు.
Also Read: Champions Trophy : ఐసీసీ ట్రోఫీపై ఇంకా కొనసాగుతున్న సందిగ్ధత
70 మంది మోస్ట్ వాంటెడ్..
పరారీలో ఉన్న 700 మంది ఖైదీల్లో 70 మంది వరకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లు, ఉరిశిక్ష పడిన ఖైదీలు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. జులై 19వ తేదీన బంగ్లాదేశ్ అల్లర్ల సందర్భంగా ఢాకా నగరానికి తూర్పున ఉన్న నార్సింగి జైలుపై వందల మంది నిరసన కారులు దాడి చేసి నిప్పంటించారు. ఆ తర్వాత జైలులో ఉన్న వేలాది ఖైదీలను బయటకు తీసుకునిపోయారు ఆందోళన కారులు.ఈ ఘటన జరిగిన తర్వాత వారాల్లో దేశంలోని మరో 4 జైళ్లపై కూడా దాడులు జరిగాయి.
Also Read: చట్టాలంటే ప్రజలకు భయం, గౌరవం లేదు.. రోడ్డు ప్రమాదాలపై నితిన్ గడ్కరీ
ఇందులో అత్యంత కరుడుగట్టిన నేరస్థులను ఉంచే కషిమ్పుర్ జైలు కూడా ఉండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. పరారీలో ఉన్న ఖైదీల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీస్ శాఖ ప్రతినిధి ఇమామ్ హోసైన్ సాగర్ వెల్లడించారు. ఇప్పటికే తప్పించుకుపోయిన వారి సమాచారాన్ని బంగ్లాదేశ్లోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపినట్లు చెప్పారు. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం వీడిన తర్వాత బెయిల్ పొందిన ఉగ్రవాదులపై కూడా తమ నిఘా ఉందని వివరించారు.