Maoist : చర్లలో మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాల కలకలం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సోమవారం మావోయిస్టు కరపత్రాలు, బ్యానర్లు కలకలం రేపాయి. మావోయిస్టు పార్టీ నేటి నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టులు కరపత్రాలు వేయడంతో పాటు బ్యానర్లు ఏర్పాటు చేశారు. 

New Update
charla

Maoists charla

  Maoist : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సోమవారం మావోయిస్టు కరపత్రాలు, బ్యానర్లు వేసి కలకలం రేపాయి. మావోయిస్టు పార్టీ నేటి నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ చర్ల మండలంలో పలు ప్రాంతాల్లో మావోయిస్టులు కరపత్రాలు వేయడంతో పాటు బ్యానర్లు ఏర్పాటు చేశారు. 

జిల్లాలోని ఆర్ కొత్తగూడెం ప్రధాన రహదారితోపాటు దానవాయిపేటలోనూ మావోయిస్టులు కరపత్రాలు వేయడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలను నిర్వహించాలని కరపత్రాల్లో పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని అందులో డిమాండ్‌ చేశారు. కాగా మావోయిస్టుల కరపత్రాలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు