/rtv/media/media_files/2025/04/20/rfQyjVHx5JIr6HArjDOc.jpeg)
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లీడర్ హత్యకు కుట్ర కలకలం రేపింది. మహబూబ్ నగర్ జిల్లాలో రెక్కి నిర్వహిస్తుండగా సుపారీ గ్యాంగ్ను పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. దుండగులు పక్కా ప్లాన్తో దేవరకద్ర బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారు. సుపారీ గ్యాంగ్ నెల రోజులుగా ప్రశాంత్రెడ్డి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడని వివరాలు సేకరిస్తున్నారు. ప్రశాంత్రెడ్డి ఆఫీసుల దగ్గర తిరుగుతూ మర్డర్కు ప్లాన్ వేశారు. పట్టుబడిన వారిలో ఒకరు ఇదివరకే ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్నాడు.
Also read: Husband: భార్య బ్యూటీపార్లర్కు వెళ్తే షాక్ ఇచ్చిన పాపిష్టి మొగుడు.. పాపం బోడిగుండు భార్య
ప్రశాంత్ రెడ్డి హత్యకు రూ.2కోట్లతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. డీల్కు సంబంధించిన ఆడియో వైరల్ అవుతోంది. గ్యాంగ్ సభ్యులు కర్నూలు, కర్నాటకకు చెందిన రౌడీషీటర్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి అనుచరులు అనుమానాస్పద వ్యక్తల కదలికలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.
( bjp-leader | supari-murder | Devarakadra | Prashanth reddy | police-arrested | latest-telugu-news)