Telangana Crime News: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికి.. భయంతో ఉరేసుకున్న తెలంగాణ యువకుడు

తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ గోపీ (25) ఆందోళనకు గురై ఉరేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో చోటుచేసుకుంది. కోర్టుకు హాజరై ఫైన్ కట్టాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించడంతో భయంతో సూసైడ్ చేసుకున్నాడు.

New Update
Khammam youth suicide after caught drunk and driving

Khammam youth suicide after caught drunk and driving

ఓ యువకుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు దొరికాడు. కోర్టుకు వచ్చి ఫైన్ కట్టాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ యువకుడు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్త గూడెంలో జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికి

అతడి పేరు గోపీ (25). అతడిది ఖమ్మం జిల్లా ముదిగొండ. ఏడాది క్రితం అదే జిల్లాకు చెందిన ఓ యువతిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె కొత్తగూడెంలో నర్సింగ్ చదువుతోంది. గోపీ ప్రైవేట్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ఖమ్మం ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇటీవల గోపీ మద్యం సేవించి తన బైక్‌పై వస్తూ పోలీస్ తనిఖీల్లో దొరికాడు. 

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

అనంతరం జూన్ 19న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరై ఫైన్ కట్టాలని పోలీసులు అతడికి చెప్పారు. దీంతో నెక్స్ట్ డే కట్టేస్తానని గోపీ చెప్పాడు. కానీ ఆ మరుసటి రోజు గోపీ రాలేదు. దీంతో పోలీసులు అతడికి ఫోన్ చేసి మరోసారి గుర్తు చేశారు. ఫైన్ కట్టకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు.

దీంతో గోపీ తన భార్యను కాలేజీ వద్ద డ్రాప్ చేసి.. ఇంటికి వచ్చి దూలానికి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అనంతరం గోపీ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ పోలీసులు భయపెట్టడంతోనే తన భర్య ఆత్మహత్య చేసుకున్నాడని అందులో పేర్కొంది. 

Also Read :  ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
తాజా కథనాలు