/rtv/media/media_files/2024/11/18/HB52oX2XznMBz3Ii8iE3.jpg)
Khammam: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులూ ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు వీలుగా.. ‘స్పోకెన్ ఇంగ్లీష్’ తరగతులు నిర్వహించాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారులు నిర్ణయం తీసుకున్నారు. సర్కారీ బడుల్లో ఇంగ్లిష్ కేవలం ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉండడంతో.. విద్యార్థులు కేవలం పరీక్షల్లో రాయడానికి అవసరమైనంత మాత్రమే చదువుతూ నేర్చుకుంటున్నారు. దీనివల్ల భాషపై వారికి పట్టు లేకుండా పోతోంది. ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు వారికి అది తీవ్ర అడ్డంకిగా
తమకు తెలిసిన అరకొర ఆంగ్లంలో మాట్లాడలేక.. భయంతో చదువులో వెనకబడిపోతున్నారు. అందుకే ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని దృఢసంకల్పంతో ఖమ్మం జిల్లా విద్యా శాఖాధికారులు నడుం కట్టారు. సిలబ్సలోని సబ్జెక్టులతో పాటు స్పోకెన్ ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా పెట్టి బోధిస్తూ.. పిల్లలు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాదించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!
జిల్లాలోని మొత్తం 34 ప్రభుత్వ పాఠశాలలకుగాను తొలివిడతగా 16 బడుల్లో ఆగస్టు 14 నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు మొదలు పెట్టారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు రోజూ సాయంత్రం పూట 45 నిమిషాలపాటు ఇంగ్లిష్ మాట్లాడడంలో కోచింగ్ ఇస్తున్నారు. ఇందుకు.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన డిజిటల్ టీవీలను వినియోగించి దాని ద్వారా విద్యార్థులకు ఆంగ్లం మాట్లాడడంలో కోచింగ్ ఇస్తున్నారు.
కాగా.. ఈ పాఠాలు చెప్పడం కోసం విద్యా శాఖ అధికారులు ‘భారత్ దేఖో’ అనే ఎన్జీవోతో ఒప్పందం చేసుకోవడమే కాకుండా.. ఆ సంస్థ ప్రతినిధులు పవిత్ర, అస్రా ద్వారా ముందుగా ఇంగ్లిష్ టీచర్లకు.. పిల్లలతో ఎలా మాట్లాడించాలి? వారిలో ఆంగ్లం పట్ల ఉన్న భయాన్ని ఎలా పోగొట్టాలి? అనే అంశాలపై ఆన్లైన్లో శిక్షణ ఇప్పించారు.
ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు!
ఇంగ్లిష్ కథలు, సన్నివేశాలు, కార్టూన్ షోలు, కొన్ని వీడియోలను కూడా ఆ ఎన్జీవో పంపించింది. ఈ శిక్షణతో విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడగలుగుతున్నారు. గతంలో ఉపాధ్యాయులు ఏదైన ప్రశ్న ఇంగ్లిష్లో అడిగినా.. సమాధానం తెలుగులోనే చెప్పే పిల్లలు, ఇప్పుడు ఆంగ్లంలోనే బదులిస్తున్నారు. ఈ శిక్షణ విజయవంతమైన నేపథ్యంలో.. రెండో దశలో మిగిలిన 18 పాఠశాలల్లోనూ స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు ఏర్పాటు చేస్తామని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో) సోమశేఖర శర్మ తెలిపారు.
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ చొరవతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల స్టూడెంట్స్ కి కూడా స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహిస్తుండడం వల్ల.. విద్యార్థులు ఇంగ్లిష్ లో చక్కగా మాట్లాడగలుగుతున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
గతంలో తరగతికి సంబంధించిన ఇంగ్లిష్ సబ్జెక్టును మాత్రమే బోధించేవారం. ఆంగ్లంలో మాట్లాడగలిగే నైపుణ్యం పిల్లలకు అంతగా ఉండేది కాదు. కానీ, ఇప్పుడీ స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులతో విద్యార్థులు ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటున్నారు. ఇంగ్లిష్లో చర్చలు, ఇంటరాక్షన్ ప్రోగ్రాములు నిర్వహిస్తున్నాం. ఈ శిక్షణతో పిల్లల్లో వస్తున్న మార్పు చూసి మాకే ఆశ్చర్యం వేస్తోందని ఆయన తెలిపారు.
Also Read: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్న్యూస్.. వచ్చే ఆరు నెలలూ పండగే
Also Read: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?