/rtv/media/media_files/2025/02/21/6AEaY0KWzNXIYcCz4l7t.jpg)
fire accident
Hyderabad: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బండ్లగూడ సమీపంలోని నార్సింగ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాషా కాలనీలోని ఓ భవనంలో సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. రెండు అంతస్థుల వరకు ఈ మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే ఓ కుటుంబం పలువురు మహిళలు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లాలో
ఇదిలా ఉంటే ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్ధన స్వామి వారి రధోత్సవ కార్యక్రమంలో మరో అగ్నిప్రమాదం జరిగింది. రథోత్సవ కార్యక్రమంలో భాగంగా బాణాసంచా కాలుస్తుండగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పందిరిపై ప్రమాదవశాత్తు ఓ తారాజువ్వ ఎగిరి పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడుతుండడంతో ఆలయంలోని భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. కొంతమంది సాహసం చేసి పందిరి పై తాటాకులను తీసి కింద పడేశారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Also Read: Lucky Baskhar: ఇదేం క్రేజ్ రా బాబు.. 'లక్కీ భాస్కర్' ఎక్కడ వదలట్లేదు.. నెట్ ఫ్లిక్స్ లో మరో రికార్డు