రోజుకో కొత్త రకం మర్డర్.. హైదరాబాద్‌లో అసలేం జరుగుతోంది?

హైదరాబాద్‌లో రోజులవ్యవధిలోనే 3 మర్డర్ కేసులు. మీర్‌పేర్‌లో వెంకటమాధవి, మేడ్చల్ మునీరాబాద్‌లో 25ఏళ్ల యువతి, కిడ్నాప్‌కు గురై ఖమ్మంలో శవం దొరికిన బొల్లు రమేష్. ఈ మూడు హత్యలు రాజధానిలో సంచలనం రేపుతున్నాయి. జనవరిలోనే దాదాపు 10 హత్యలు సిటీలో జరిగాయి.

author-image
By K Mohan
New Update
hyd crimes

hyd crimes Photograph: (hyd crimes)

ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో హత్యలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలు కరువయ్యాయి. హఢలెత్తిస్తున్న హైదరాబాద్.. వారంరోజుల్లోనే మూడు మర్డర్ మిస్టరీలు. సిటీలో కిడ్నాప్‌ చేసి.. ఖమ్మం మిర్చి తోటలో బిజినెస్‌మ్యాన్ హత్య, మేడ్చల్ ఓఆర్ఆర్ కల్వర్టు కింద 25ఏళ్ల యువతి అత్యాచారం చేసిన దుండగులు. బండరాళ్లుతో మోది చంపి, పెట్రోల్ పోసి డెడ్‌బాడీకి నింపంటించారు. మీర్‌పేట్ మర్డర్ మిస్టరీ తేలకముందే.. మరో రెండు హత్యలు హైదరాబాద్ నగరవాసులను హఢలెత్తిస్తున్నాయి. కోటికి పైగా జనాభా నివసిస్తున్న హైదరాబాద్‌లో ప్రజలకు సేఫ్టీ లేకుండా పోయింది. ఎక్స్ ఆర్మీ ఉద్యోగి గురుమూర్తి భర్యను చంపిన విధానం వింటే ఒళ్లు జలదరిస్తోంది. సైబర్ సిటీ.. క్రైమ్ సిటీగా మారుతుందా అన్నట్టుగా రోజుకో కొత్త రకం హత్య వెలుగులోకి వస్తోంది.

2024 రాజధానిలో 64శాతం పెరిగిన క్రైమ్ రేటు

హైదరాబాద్‌లో క్రైంకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. 2023లో 25,488 కేసులు నమోదవగా.. 2024లో 35,944 కేసులకు ఈ సంఖ్య పెరిగింది. భాగ్యనగరంలో గతేడాది 64శాతం క్రైమ్‌ రేట్ పెరిగిందని పోలీసులు విడుదల చేసిన నివేదికలో తేలింది. 2025లో కూడా ఏమాత్రం తగ్గనివ్వం అన్నట్టుగా క్రినిమనల్ వ్యవహరిస్తున్నారు. మరి క్రైం రేటు తగ్గించడానికి తీసుకున్న చర్యలేవి.  హైదరాబాద్‌లో నేరస్తులు ఈనెల జనవరిలో రక్త చరిత్ర రాస్తున్నారు. మర్డర్లు, మానభంగాలు చేసే వారికి చట్టం నుంచి తప్పించుకోలేం, శిక్ష కచ్చితంగా పడుతుందనే భయమే లేకుండా పోయింది. చట్టాలు వచ్చినా.. నేరాలు ఎందుకు తగ్గట్లే. అనుకోకుండా లేదా ఆత్మరక్షణ కోసం చేసిన హత్యలు వేరు, పక్కా ప్లానింగ్‌తో ఉద్దేశపూర్వకంగా చంపుతున్న హత్యలు వేరు. ఈ నెలలో జరిగిన నేరాలన్నీ దాదాపు ఉద్దేశపూర్వకంగా జరిగినవే ఉన్నాయి. అసలు క్రిమినల్ ఆలోచనలను నేరస్తుల మైండ్‌లో నుంచి ఎలా తుడిచేయాలని పోలీస్ యంత్రాగం ఆలోచిస్తోందా? లేదా? ఇవన్నీ చూస్తుంటే న్యాయస్థానాల తీరు, చట్టాల్లో లొలుసుల కారణంగానే క్రిమినల్ పెరిగిపోతున్నారా అనే అనుమానాలు రాక మానదు. 

హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసి మిర్చితోటలో శవం..

హైదరాబాద్‌లో కిడ్నాప్ అయిన బొల్లు రమేష్(52) ఖమ్మం- సూర్యాపేట్ హైవే పక్కనున్న మిర్చితోటలో జనవరి 25న శవమై కనిపించాడు. జనవరి 19న తన భర్త బొల్లు రమేష్ (52) కనిపించకుండాపోయాడంటూ విక్రంపురి కాలనీకి చెందిన మహిళ నట్టి జనని మిస్సింగ్ కేసు నమోదు చేయగా దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బొల్లు రమేష్‌ మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. ఖమ్మం-సూర్యాపేట జాతీయరహదారి లింగారంతండా వద్ద మిర్చితోటలోని మృతదేహం రమేష్‌దేనని కార్కానా పోలీసులు నిర్ధారించారు. మృతుడి చేతులను తాళ్లతో బిగించి దారుణంగా కొట్టి హత్యచేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే మృతుడి మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ఓ నిందితుడిని అరెస్టు చేశారు.

బండ్లగూడకు చెందిన వ్యాపారవేత్త అహ్మద్ ఖాద్రితో విభేదాలు ఉన్నట్లు రమేష్ భార్య ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఖాద్రిని అదుపులోకి తీసుకొని విచారించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఖమ్మం పాల్వంచలో హత్య చేసి మృత దేహాన్ని పూడ్చి పెట్టినట్లు ఖాద్రి అంగీకరించాడని వెల్లడించారు. మృతుడు బొల్లు రమేష్ ఏపీ, తెలంగాణ పాన్ మసాలా డీలర్‌గా వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ట్రేడింగ్ పేరిట బొల్లురమేష్‌ను ట్రాప్ చేసి హతమార్చినట్లు విచారణలో తెలిసింది. 

Read also : మిర్చితోటలో కోటీశ్వరుడి మృతదేహం.. తాళ్లతో కట్టి, కొట్టి చంపి!

ఓఆర్ఆర్ కాజ్‌వే కింద యువతి దారుణ హత్య

మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో 25 ఏళ్ల యువతి దారుణహత్యకు గురైంది. యువతిని బండరాళ్లతో కొట్టిచంపి అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టారు. జనవరి 25న కాలిన శరీరభాగాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓఆర్ఆర్ కాజ్ వే కింద పడేసి వెళ్ళిపోయారు. దిశ తరహాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృతురాలి వివరాలు ఇంకా తెలియలేదు. ఆమె ఎవరూ, ఇక్కడకు ఎలా వచ్చిందీ, ఎవరితో వచ్చిందీ తెలుసుకునేందుకు పోలీసులు పరిశోధన ముమ్మరం చేశారు. దీంతో ఇప్పుడు మృతురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారనుంది. యువతిని దుండగులు రేప్ చేసి చంపారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. యువతి వంటిపై బట్టలు సరిగ్గా లేవని చెబుతున్నారు పోలీసులు. యువతి చేతి మీద ఇద్దరి పేర్లు కనిపించాయి.  శ్రీకాంత్, నరేంద్ర అనే పేర్లు ఆమె చేతిపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటి ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read also :మునీరాబాద్ లో యువతి దారుణ హత్య

మీర్‌పేట్‌లో భార్యను కిరాతకంగా చంపిన భర్త

ప్రకాశం జిల్లా రాచర్ల మండంలం జేపీ చెరువునకు చెందిన గురుమూర్తి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. అదే గ్రామానికి చెందిన వెంకటమాధవితో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. హైదరాబాద్ కంచన్‌బాగ్‌లో కాంట్రాక్ట్ సెక్యురీటీ గార్డ్‌గా పని చేస్తూ మీర్‌పేట్‌లో నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. సంక్రాంతి పండగకు పిల్లల్ని బంధువుల ఇంటికి పంపారు. జనవరి 15న వెంకటమాధవి, గురుమూర్తి మధ్య మాటామాట పెరిగి వివాదమైంది. ఆవేశంలో గురుమూర్తి భర్య తల గోడకేసి బలంగా కొట్టాడు. వెంకటమాధవి చనిపోయింది. శవాన్ని మాయం చేయడానికి గురుమూర్తి డెడ్‌బాడీని ముక్కలు చేసి ప్రెషర్ కుక్కర్లో శరీరభాగాలను ఉడికించాడు. తర్వాత కండరాల నుంచి ఎముకలు వేరు చేసి పొడిగా చేశాడు. ఆ మిశ్రమాన్ని ఎండబెట్టి కాల్చిన బూడిదను నివాసానికి దూరంగా ఉన్న చెరువులో కలిపాడు.

ఏం తెలియనట్లుగా అత్తమామలతో వెంకటమాధవి జనవరి 13 నుంచి కనిపించడం లేదని జనవరి 18న మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సిగ్ కేసు నమోదు చేశాడు. భర్తపై అనుమానంతో పోలీసులు విచారించడా తానే హత్య చేసినట్లు గురుమూర్తి ఒప్పుకున్నాడు. అతున హత్య చేసినట్లు ఆధారాలు ఏవని పోలీసులనే ఎదురు ప్రశ్నించాడు. గురరుమూర్తి మర్డర్‌ ప్లాన్ చేధించడం పోలీసులకు ఓ సవాల్‌గా మారింది. వారం రోజులుగా క్లూస్ , ఫొరెన్సిక్ టీంలు సాక్ష్యాల కోసం ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఇంతటి కిరాత హత్య రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోనే సంచలనంగా మారింది.

Read also : మీర్పేట్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్..  కుక్కతో ఆ పని చేయలేదన్న గురుమూర్తి!

మేడ్చల్ హాస్టల్‌లో క్యాబ్ డ్రైవర్ మర్డర్..

అనురాగ్ రెడ్డి హాస్టల్‌లో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న మహేందర్‌రెడ్డిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. పీర్జాదిగూడ మల్లికార్జున నగర్‌లో అనురాగ్‌రెడ్డి బాయ్స్ హాస్టల్ ఉన్నది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ కారణంగా హత్య చేశారు. ఈ హత్యకు గల కారణం.. హాస్టల్ ఓనర్ పద్మతో మహేందర్‌రెడ్డికి గొడవలు జరుగుతున్నాయి. మహేందర్‌రెడ్డి ఈ మధ్యనే హాస్టల్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయాడు. హాస్టల్ ఓనర్ పద్మ శుక్రవారం ఉదయం మహేందర్‌రెడ్డిని హాస్టల్‌కి పిలిపించింది. అనంతరం శనివారం ఉదయం 3:30 గంటలకు మహేందర్‌రెడ్డి హాస్టల్‌కి వచ్చాడు. అదే హాస్టల్లో ఉంటున్న కిరణ్‌రెడ్డి అనే వ్యక్తితో మహేందర్‌రెడ్డిని దారుణంగా హత్య చేపించింది.

నార్సింగ్ పుప్పాలగూడ గుట్టల్లో జంట హత్యలు

హైదరాబాద్ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పుప్పాలగూడలో జంట హత్యలు కూడా సంచలనం రేపాయి. జనవరి 14న మధ్యప్రదేశ్‌కి చెందిన సాకేత్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు పుప్పాలగూడ గుట్టల్లో హత్యకు గురైయ్యారు. గచ్చిబౌలిలో సాకేత్, వనస్థలిపురంలో బిందులపై మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. సాకేత్, బిందుల మధ్య గతకొంతకాలంగా వివాహేతర సంబంధం నడుస్తోంది. సాకేత్‌ హౌస్‌ కీపింగ్‌ చేస్తూ నానక్‌రామమ్‌గూడలో ఉంటున్నాడు. బింధు ఎల్బీనగర్‌లో నివాసం ఉంటున్నది. బిందుకు సాకేత్‌తోపాటు మరో వ్యక్తితో ఎఫైర్ ఉంది. జనవరి 11న బిందును ఎల్బీనగర్ నుంచి నానక్‌రామ్‌గూడకు పిలిపించాడు సాకేత్. జనవరి 14వ తేదీన పుప్పాలగూడ గుట్టల్లో ఏకాంతంగా ఉండగా మరో ప్రేమికుడికి వీరు అడ్డంగా దొరికిపోయారు. దీంతో వీరిని అతను హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గురైన బిందుకు ముగ్గురు పిల్లలున్నారు. బిందు కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హంతకుడి కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

Read also : Hyderabad: నార్సింగిలో ఘోరం.. బండరాళ్లతో మోది జంట హత్య!

Advertisment
Advertisment
తాజా కథనాలు