MMTS Train Incident: హైదరాబాద్‌లో దారుణం.. MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం

హైదరాబాద్ MMTS ట్రైన్‌లో యువతిపై ఓ దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. యువకుడి నుంచి తప్పించుకునేందు బాధితురాలు రన్నింగ్ ట్రైన్ నుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలైన యువతిని చికిత్స కోసం గాంధీ హాస్పిటల్‌లో చేర్పించారు.

New Update
Attempted rape

Attempted rape Photograph: (Attempted rape)

MMTS Train Incident: హైదరాబాద్ కొంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. రన్నింగ్‌ ట్రైన్‌లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి యత్నించాడు. అతడి నుంచి తప్పించుకోడానికి యువతి ట్రైన్ బోగీ నుంచి కిందికి దూకింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. ఎంఎంటీఎస్‌ రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆ దుండగుడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు రైలు నుంచి బయటకు దూకగా తీవ్ర గాయాల పాలైంది.

Also read: SRH mems: SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్

Also read: Saturn: అంతరిక్షంలో అద్భుతం.. శని గ్రహం వలయాలు మాయం!

సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ఘటన ఆదివారం రాత్ర సమయంలో జరిగింది. అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్‌ఫోన్‌ మరమ్మతు కోసం ఆదివారం సికింద్రాబాద్‌కు వెళ్లి తిగిరి ఎంఎంటీఎస్‌లో మేడ్చల్‌కు బయలుదేరింది. మహిళల కోచ్‌లో ఆమె ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్‌ స్టేషన్‌లో దిగిపోయారు. బోగీలో యువతి ఒక్కతే ఉండగా ఓ యువకుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు రైలు నుంచి బయటకు దూకింది. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీపుటేజ్ ఆదారంగా నిందితుడిని కోసం గాలిస్తున్నారు. 

Also Read :  అమెరికాలో తాగుబోతు బీభత్సం.. భారతీయ తండ్రీకూతుళ్లను కాల్చి చంపాడు

Also Read :  తల్లి డైరెక్షన్‌.. కొడుకులు యాక్షన్‌.. షేక్​ పేట చోరీ కేసులో బిగ్‌ట్విస్ట్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు