Ganesh Laddu : రూ.2 కోట్ల 30లక్షలు పలికిన గణేష్ లడ్డూ... ఎక్కడంటే?

హైదరాబాద్ లోని గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది. రాజేంద్రనగర్ లోని బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్‌ విల్లావాసులు శుక్రవారం జరిగిన వినాయక లడ్డూని వేలంలో రూ.2,31,95,000 పైగా చెల్లించి దక్కించుకున్నారు.

New Update
ganesh laddu

హైదరాబాద్ లోని గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది. రాజేంద్రనగర్ లోని బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్‌ విల్లావాసులు శుక్రవారం జరిగిన వినాయక లడ్డూని వేలంలో రూ.2,31,95,000 పైగా చెల్లించి దక్కించుకున్నారు. గతేడాది ఇదే కమ్యూనిటీలో లడ్డూ రూ.1.87 కోట్లు పలికింది. ఏటా జరిగే ఈ వేలం పాటకు స్థానిక  భక్తులతో పాటుగా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా హాజరవుతూ ఉంటారు. ఈ సారి రూ. కోటి నుంచి వేలం పాట మొదలుపెట్టారు.

బిడ్డింగ్ ఉత్సాహంగా జరిగింది, 80 కి పైగా విల్లా యజమానులు నాలుగు గ్రూపులుగా విభజించబడి 2 గంటల్లో దాదాపు 500 కి పైగా బిడ్లు వేశారు. చివరగా పదికేజీల లడ్డూను రూ.2 కోట్లకు పైగా కొనుగోలు చేశారు. 2018లో కేవలం రూ. 25,000తో ప్రారంభమైన ఈ వేలం, ఇప్పుడు తెలంగాణలో అత్యంత ఖరీదైన పండుగ లడ్డూలలో ఒకటిగా ఎదిగింది. 2019లో, ఇది రూ.18.75 లక్షలు, ఆ తర్వాత 2020లో రూ27.3 లక్షలు, 2021లో రూ.41 లక్షలు, 2022లో రూ.60 లక్షలు 2023లో రూ. 1.26 కోట్లు పలికింది. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని సాధారణంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు.

2024లో  కోటి 87 లక్షల రూపాయిలు 
2023లో కోటి26 లక్షల  రూపాయిలు
2022లో రూ. 60 లక్షలు 
2021: రూ.41 లక్షలు
2020: కోవిడ్-19 కారణంగా వేలం జరగలేదు.
2019: రూ. 18.75 లక్షలు

కాగా రాయదుర్గంలోని మై హోమ్ భూజాలో గణేష్ లడ్డూ కూడా చాలా ఫేమస్. ఈ లడ్డూ వేలంపాట ప్రతి సంవత్సరం రికార్డు ధరలు పలుకుతోంది. ఈ ఏడాది ఖమ్మంకు చెందిన  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కొండపల్లి గణేశ్‌ రూ.51,07,777 లకు పాడుకొని ఈ లడ్డూను సొంతం చేసుకున్నాడు.  గత ఏడాది మైహోమ్‌ భుజ లడ్డూను ఆయనే రూ.29 లక్షలకు పాడారు. 

Advertisment
తాజా కథనాలు