హైదరాబాద్లో మరో భారీ దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. అయితే.. కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు వారి కుట్రను భగ్నం చేశారు. పక్కాగా స్కెచ్ చేసి వారిని పట్టుకున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ హైదరాబాద్ లో భారీ దాడులకు పాల్పడ్డట్లు నిర్ధారించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే.. పోలీసుల విచారణలో పలు కీలక వివరాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. భాగ్యనగరం పేలుళ్లు జరపడం కోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ ఉగ్రవాదులకు సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు వచ్చినట్లు పోలీసులు తేల్చారు. అయితే.. ఈ బ్లాస్ట్ వెనుక ఉన్న అసలు సూత్రదారి ఎవరు? ఎక్కడెక్కడ పేలుళ్లకు వీరు ప్లాన్ చేశారు? స్థానికంగా ఇంకా ఎవరైనా వీరికి సహకరించారా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.
ఇది కూడా చదవండి: TG Crime: భీమానదిలో విషాదం..మొసలి దాడిలో రైతు గల్లంతు
2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో రెండు చోట్ల ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. 131 మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడింది. ఈ నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ గత నెల 8న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దిల్సుఖ్నగర్ పేలుళ్ల తర్వాత దాదాపు 15 ఏళ్లకు మళ్లీ రాష్ట్రంలో ఉగ్రవాదులు పేలుళ్లకు ప్లాన్ చేశారన్న వార్త సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: BREAKING: చార్మినార్ అగ్ని ప్రమాద బాధితులకు మోదీ పరిహారం
సంగారెడ్డి జిల్లాలో ఉగ్రవాది అరెస్ట్..
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో అస్సాంకు చెందిన ఇస్లాంను తాజాగా అరెస్ట్ అరెస్టు చేశారు. ఈనెల 14న ఇస్లాంను అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇస్లాం గొల్లపల్లిలో కొద్దిరోజులుగా మేస్త్రీగా పనిచేస్తున్నారు. అతను అస్సాంలోని ఓ మొబైల్ షాపులో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులు అమ్మినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆ నకిలీ సిమ్ కార్డులను పాకిస్తానీలకు అమ్మినట్లు అనుమానం వ్యక్తం అవుతోంది.