/rtv/media/media_files/2025/01/25/0eeRvFwbF5cN3Ahub5hv.webp)
Wine Shops Closed
Hyderabad Wines Close: ఈ నెల 23న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Election News) నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. అలాగే కౌంటింగ్ జరిగే ఈ నెల 25న కూడా వైన్స్ క్లోజ్ చేయాలని స్పష్టం చేశారు. బార్లు, రిజిస్టర్డ్ క్లబ్లలో మద్యం అమ్మకాలు ఉండవని తెలిపారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 23 న జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: వీర్యం తెలుపుకు బదులుగా పసుపులో ఉందా..కారణం ఇదే
వైన్స్ షాపులు క్లోజ్
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వైన్స్, బార్ లను ఈ నెల 21 వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 23 సాయంత్రం 4 గంటల వరకు మూసివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్, డీజీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తేదీల్లో మద్యం విక్రయాలను నగరంలో నిషేధిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 26 తేదీ ఉదయం 6 గంటల వరకు కూడా మద్యం విక్రయాల పై నిషేధం ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలను ఉల్లంగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: శరీరంలో కనిపిస్తే ఈ లక్షణాలు ఉంటే అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్టే
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అసన్ ఎఫెండ్ను మజ్లిస్ పార్టీ ఖరారు చేసింది. బీజేపీ తరపున ఎన్ గౌతంరావు బరిలో ఉన్నారు ఇప్పటివరకు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ, ఎంఐఎంతో పాటు మరో రెండు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు దాఖలయ్యాయి. పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్ణయించాయి. కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం ఏకగ్రీవం అవుతుందనుకున్న సమయంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ నామినేషన్తో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొననుంది. ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. 25 తేదీన కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలు ప్రకటించనున్నారు. ఘర్షణలు.. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మద్యం దుకాణాలు తెరచుకుంటాయి.
Also Read: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్