TGPSC Group 1: సుప్రీం కోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు

TG: గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 అభ్యర్థుల తరఫున సుప్రీంకోర్టులో అడ్వకేట్ మోహిత్ రావు పిటిషన్ వేశారు. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్ష వాయిదాపై వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరపనుంది.

New Update
Supreme Court 3

TGPSC Group-1: గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 అభ్యర్థుల తరఫున సుప్రీంకోర్టులో (Supreme Court) అడ్వకేట్ మోహిత్ రావు పిటిషన్ వేశారు.  తమ పిటీషన్ అత్యవసరంగా విచారణ జరపాలని చీఫ్ జస్టిస్ కోర్టులో స్పెషల్ మెన్షన్ చేశారు మోహిత్ రావు. గ్రూప్ 1 అభ్యర్థుల కేసును సోమవారం రోజున విచారణ జరుపుతామని చీఫ్ జస్టిస్ చెప్పారు. గ్రూప్-1 పరీక్షలు వాయిదా వెయ్యాలని పిటిషన్ వేశారు. గ్రూప్-1 పరీక్షల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను ఫాలో కాలేదని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

ఈ నెల 21 నుంచి...

ఇటీవల గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు అడ్డకుంలు తొలిగిస్తూ తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే అధికారులు మెయిన్స్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా నిన్న  TGPSC అధికారులతో సీఎస్ శాంతి కుమారి సమావేశం నిర్వహించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు, సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. కాగా ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ జరగనుంది. ఈ మెయిన్స్ పరీక్షకు మొత్తం 6 పేపర్లు ఉండనున్నాయి. ప్రతీ పేపర్ కు 150 మార్కులు ఉంటాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనుంది టీజీపీఎస్సీ. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. కేవలం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రమే ఈ పరీక్ష ను నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు!

హాల్ టికెట్స్ విడుదల....

ఇటీవల TGPSC గ్రూప్-1 హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు https://hallticket.tspsc.gov.in/h022024d08f5d90-6aaa-4360-acb2-046f588e3284 లింక్ పై క్లిక్ చేసి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గ్రూప్-1 టీజీపీఎస్సీ నోటిఫికేషన్ (TGPSC Group-1) విడుదల చేసింది. మొత్తం 563 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. జూన్ 9న ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మంది హాజరు కాగా.. 31,382 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో కడియం లొల్లి.. తలపట్టుకున్న పెద్దలు!

ఇది కూడా చదవండి: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు